నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- March 07, 2026
కువైట్: కువైట్ ప్రధానమంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబా..ఆ దేశ జాతీయ జల నియంత్రణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. జల నెట్వర్క్ కార్యకలాపాలను సమీక్షించారు. ప్రధానమంత్రితో పాటు విద్యుత్ మరియు నీటి నెట్వర్క్ మంత్రి డాక్టర్ సబా అబ్దులాజీజ్ అల్-ముఖైజిమ్ మరియు మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ అదెల్ మొహమ్మద్ అల్-జమిల్ ఉన్నారు.
తన పర్యటనలో భాగంగా జల వ్యవస్థ పనితీరును నిశితంగా పరిశీలించారు. వాటర్ నెట్వర్క్ పనితీరును పరిశీలించారు.అత్యవసర పరిస్థితులకు సమర్థవంతంగా స్పందించడానికి సాంకేతిక బృందాల సంసిద్ధతను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వర్కింగ్ టీముల అంకితభావాన్ని, కృషిని ప్రశంసించారు.
దేశవ్యాప్తంగా అవసరమైన సేవలు మరియు మౌలిక సదుపాయాల స్థిరత్వాన్ని కొనసాగించడానికి నిరంతర అప్రమత్తత, సంసిద్ధత ప్రాముఖ్యతను ప్రధానమంత్రి తెలియజేశారు.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









