అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- March 07, 2026
దోహా: ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI)..ముందస్తు అధికారిక అనుమతి లేకుండా వస్తువులు లేదా సేవల ధరలను సర్దుబాటు చేయడం గురించి హెచ్చరిక జారీ చేసింది. ఇలాంటి ధోరణులను చట్టపరమైన ఉల్లంఘనగా పరిగణించబడుతుందని , అలాంటి ఉల్లంఘనలకు QR 1,000,000 వరకు జరిమానా విధించబడుతుందని తెలిపింది.
ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలిన వ్యాపారాలకు వర్తించే జరిమానాలను మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
• ఒక నెల నుండి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష.
• ఒక నెల వరకు సంస్థను తాత్కాలికంగా మూసివేయడం మరియు సంబంధిత వస్తువులను స్వాధీనం చేసుకోవడం/జప్తు చేయడం.
• పునరావృతం అయితే రెట్టింపు జరిమానాలు/జైలుశిక్ష.
వినియోగదారుల హక్కులను రక్షించడానికి మరియు మార్కెట్ స్థిరత్వాన్ని కొనసాగించడానికి, ధరల సవరణలు 2008 నాటి వినియోగదారుల రక్షణపై చట్టం నంబర్ (8) మరియు తప్పనిసరి ధర మరియు లాభ నిర్ధారణపై 1972 నాటి చట్టం నంబర్ (12) నిబంధనలకు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
చట్టపరమైన జవాబుదారీతనాన్ని కలిగి ఉండటానికి ఏదైనా ధర సర్దుబాట్లు చేసే ముందు కఠినమైన ప్రోటోకాల్ను అనుసరించాలని MOCI అన్ని సంస్థలకు సూచించింది.
వ్యాపారులు మంత్రిత్వ శాఖ నుండి ముందస్తు అనుమతి పొందాలని, అన్ని ధరలను ఎలక్ట్రానిక్గా నమోదు చేయాలన సూచించింది.
మరింత సమాచారం కోసం లేదా ఉల్లంఘనలను నివేదించడానికి, ప్రజలు మరియు వ్యాపారులు వాట్సాప్ ద్వారా 16001, +974 66111400 నంబర్లలో సంప్రదించాలి. లేదా అధికారిక వెబ్సైట్ ని సందర్శించాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు మరియు వ్యాపారులకు సూచించింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









