ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- August 06, 2026
హైదరాబాద్: తెలంగాణ సిద్ధాంతకర్త, రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమానికి మార్గదర్శకుడైన ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా డీజీపీ సి.వి.ఆనంద్ నివాళులర్పించారు. పలు ప్రముఖులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా డీజీపీ సి.వి.ఆనంద్ మాట్లాడుతూ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చూపిన దూరదృష్టి, అచంచలమైన నిబద్ధత తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఆయన అందించిన మేధోపరమైన మార్గనిర్దేశం, ఉద్యమానికి ఇచ్చిన బలమైన పునాది ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ తెలంగాణ అభివృద్ధికి కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!
- కువైట్లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!
- జీసీసీ-యూరప్ పార్లమెంటరీ సమావేశం.. ప్రాంతీయ భద్రతపై ఆందోళన..!!
- సౌదీలో ఎండల తీవ్రత.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు..!!
- యూఏఈలో కొత్త విద్యాసంవత్సరానికి భారీగా పెరిగిన ఖర్చులు..!!







