ఇరాన్ ను హెచ్చరించిన సౌదీ అరేబియా..!!
- March 09, 2026
రియాద్: గల్ఫ్ దేశాల పట్ల ఇరాన్ వైఖరిని సౌదీ అరేబియా తప్పుబట్టింది. ఇలాగే ఉద్రిక్తతలను కొనసాగిస్తే టెహ్రాన్ అతిపెద్ద నష్టాన్ని ఎదుర్కొవల్సి వస్తుందని హెచ్చరించింది.
ఇరాన్ నిరంతర దాడులు మరింత తీవ్రతను సూచిస్తున్నాయని పేర్కొంది. ప్రస్తుత మరియు భవిష్యత్తులో సంబంధాలపై గణనీయమైన పరిణామాలను కలిగి ఉండవచ్చని సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
పొరుగు దేశాలపై దాడి చేయడానికి ఇరాన్కు ఎటువంటి ప్రణాళికలు లేవని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ చేసిన వ్యాఖ్యలు వాస్తవంలో ప్రతిబింబించడం లేదని తెలిపింది.
సౌదీ అరేబియా నుండి ఫైటర్ జెట్లు మరియు వైమానిక ఇంధనం నింపే విమానాలు యుద్ధంలో పాల్గొంటున్నాయనే వాదనలను తోసిపుచ్చింది.
సౌదీ అరేబియా మరియు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల గగనతలాన్ని ఇరానియన్ క్షిపణులు మరియు డ్రోన్ల నుండి రక్షించడానికి ఆ విమానాలు గస్తీ నిర్వహిస్తున్నాయని రియాద్ తెలిపింది.
పౌర ప్రదేశాలు, విమానాశ్రయాలు మరియు చమురు సౌకర్యాలను లక్ష్యంగా చేసుకోవడం ఇరాన్ బెదిరింపు ధోరణిని తెలియజేస్తుందని ఆక్షేపించింది. అంతర్జాతీయ చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమేనని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తన భద్రత, సార్వభౌమాధికారం, పౌరులు మరియు నివాసితుల భద్రతను కాపాడుకోవడానికి.. అదే సమయంలో ఇరాన్ దురాక్రమణను నిరోధించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునే పూర్తి హక్కు సౌదీ అరేబియ కలిగి ఉందని పునరుద్ఘాటించింది.
తాజా వార్తలు
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు









