ఇరాన్ ను హెచ్చరించిన సౌదీ అరేబియా..!!
- March 09, 2026
రియాద్: గల్ఫ్ దేశాల పట్ల ఇరాన్ వైఖరిని సౌదీ అరేబియా తప్పుబట్టింది. ఇలాగే ఉద్రిక్తతలను కొనసాగిస్తే టెహ్రాన్ అతిపెద్ద నష్టాన్ని ఎదుర్కొవల్సి వస్తుందని హెచ్చరించింది.
ఇరాన్ నిరంతర దాడులు మరింత తీవ్రతను సూచిస్తున్నాయని పేర్కొంది. ప్రస్తుత మరియు భవిష్యత్తులో సంబంధాలపై గణనీయమైన పరిణామాలను కలిగి ఉండవచ్చని సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
పొరుగు దేశాలపై దాడి చేయడానికి ఇరాన్కు ఎటువంటి ప్రణాళికలు లేవని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ చేసిన వ్యాఖ్యలు వాస్తవంలో ప్రతిబింబించడం లేదని తెలిపింది.
సౌదీ అరేబియా నుండి ఫైటర్ జెట్లు మరియు వైమానిక ఇంధనం నింపే విమానాలు యుద్ధంలో పాల్గొంటున్నాయనే వాదనలను తోసిపుచ్చింది.
సౌదీ అరేబియా మరియు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల గగనతలాన్ని ఇరానియన్ క్షిపణులు మరియు డ్రోన్ల నుండి రక్షించడానికి ఆ విమానాలు గస్తీ నిర్వహిస్తున్నాయని రియాద్ తెలిపింది.
పౌర ప్రదేశాలు, విమానాశ్రయాలు మరియు చమురు సౌకర్యాలను లక్ష్యంగా చేసుకోవడం ఇరాన్ బెదిరింపు ధోరణిని తెలియజేస్తుందని ఆక్షేపించింది. అంతర్జాతీయ చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమేనని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తన భద్రత, సార్వభౌమాధికారం, పౌరులు మరియు నివాసితుల భద్రతను కాపాడుకోవడానికి.. అదే సమయంలో ఇరాన్ దురాక్రమణను నిరోధించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునే పూర్తి హక్కు సౌదీ అరేబియ కలిగి ఉందని పునరుద్ఘాటించింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







