డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!

- March 11, 2026 , by Maagulf
డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!

దోహా: పేలుళ్లు లేదా ఆకాశం నుండి పడిపోతున్న వస్తువులు, శకలాలకు దూరంగా ఉండాలని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) పిలుపునిచ్చింది.అలాంటి వస్తువులను సమీపించవద్దని, తాకవద్దని లేదా తరలించవద్దని హెచ్చరించింది.

ఈ మేరకు తన అధికారిక సోషల్ మీడియాలో హ్యాండిల్ లో ఒక ప్రకటన విడుదల చేసింది. సాధారణ ప్రజలు ఈ ఆదేశాన్ని పాటించడం ఎంత ముఖ్యమో మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

శకలాలు తీవ్రమైన గాయాలకు కారణమవుతాయని,ఎందుకంటే అవి తాకినట్లయితే లోతైన గాయాలు లేదా రక్తస్రావం కలిగించే అవకాశం ఉంటుందని పేర్కొంది.

పేలుళ్ల తర్వాత ఇటువంటి పదార్థాలు తీవ్రమైన వేడిని కలిగి ఉంటాయని, వాటిని తాకడం వల్ల వెంటనే కాలిన గాయాలు అవుతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.

కొన్ని శలాలు పేలకుండా ఉండే అవకాశం ఉండవచ్చని, వాటిని తరలించినా లేదా తాకినా పేలుడు సంభవించవచ్చని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.

మంత్రిత్వ శాఖ ప్రకారం, పేలుళ్ల నుండి వచ్చే శలాల్లో ఇంధన అవశేషాలు, రసాయనాలు లేదా పేలుడు నుండి వచ్చే ప్రమాదకరమైన పదార్థాలు కూడా ఉండవచ్చని, వీటిని టచ్ చేస్తే ఆరోగ్యానికి హాని కలిగించవచ్చని పేర్కొంది.

దాంతోపాటు శకలాలను తరలించడం వల్ల సంఘటనల కారణాన్ని గుర్తించడానికి అవశేషాలను పరిశీలిస్తున్నప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందాల పనికి ఆటంకం కలుగుతుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.అలాంటి వస్తువులను గుర్తించిన వెంటనే 999కి కాల్ చేయాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com