'జీరో' సినిమా దర్శకుడు శివ్కి పురస్కారం
- August 01, 2016
భిన్న కథాంశాలున్న సినిమాలు ఇటీవల కోలీవుడ్లో మరింత పెరిగాయి. దెయ్యాల కథలు ఎక్కువవుతున్న తమిళ పరిశ్రమలో అదే అంశాన్ని ఎంచుకున్నప్పటకీ.. వైవిధ్య కథను తీసుకుని 'జీరో' ద్వారా దర్శకుడు శివ్ మోహా గుర్తింపు సొంతం చేసుకున్నారు. సినీ విశ్లేషకుల మన్ననలను అందుకుందీ సినిమా. ప్రపంచ స్థాయిలో ప్రతిభావంతులైన సినీ కళాకారులను ఏటా రొచస్టోన్ సంస్థ సన్మానిస్తుంటుంది. గతంలో సౌండ్ ఇంజినీరు రసూల్పూకుట్టి, ఎస్పీబీ, గాయని వాణీజయరాంలకు కూడా ఈ సంస్థ అవార్డులు అందజేసింది. దర్శకుడిగా శివ్ మోహా తాజాగా . సదరు పురస్కారాన్ని అందుకున్నారు. ఈ విషయమై దర్శకుడు స్పందిస్తూ.. ''రోచస్టోన్కు చెందిన భారత ఉన్నతాధికారి ఇటీవల 'జీరో' సినిమాను చూశారు. మేకింగ్, స్క్రీన్ప్లేను చూసి ఆయన ఆశ్చర్యపోయారు. గ్రాఫిక్ సన్నివేశాలు కూడా భిన్నంగా ఉండటంతో ఫోన్ చేసి అభినందించారు. ఇటీవల ఆ సంస్థ ప్రతినిధులు నాకు ఉత్తమ దర్శకుడు పురస్కారాన్ని అందజేశారు. ఇది నా బాధ్యతను మరింత పెంచింది. ప్రస్తుతం క్రైం థ్రిల్లర్ కథతో ఓ సినిమాను రూపొందిస్తున్నా. వీలైనంత త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామ''ని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







