కృష్ణా పుష్కరాల ప్రాధాన్యం వివరిస్తూ 'కృష్ణమ్మ పిలిచింది'

- August 01, 2016 , by Maagulf
కృష్ణా పుష్కరాల ప్రాధాన్యం వివరిస్తూ 'కృష్ణమ్మ పిలిచింది'

కృష్ణా పుష్కరాల ప్రాధాన్యం వివరిస్తూ తెనాలి వాసి, కేంద్ర సెన్సారుబోర్డు సభ్యుడు, దర్శకుడు దిలీప్‌ రాజా 'కృష్ణమ్మ పిలిచింది' పేరుతో లఘుచిత్రం రూపొందిస్తున్నారు. ఆలూరి సుందరరామయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం విజయవాడ లబ్బీపేటలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ప్రారంభమైంది. తొలిసన్నివేశాన్ని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామిపై దర్శకుడు దిలీప్‌ రాజా చిత్రీకరించారు. పుష్కరాల ప్రాధాన్యం వివరిస్తూ స్వామీజీ చెప్పిన విశేషాలు తొలి ఎపిసోడ్‌లో ఉంటాయని దర్శకుడు తెలిపారు. కృష్ణానది పుట్టిన ప్రదేశం నుంచి హంసలదీవిలో సాగర సంగమం చేరేవరకు ఉన్న పుణ్యక్షేత్రాల విశేషాలు చిత్రంలో ఉంటాయని వివరించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చిత్రీకరణ ముగిసిన తరువాత శాటిలైట్‌ ఛానల్‌ ద్వారా ప్రసారం చేస్తామని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com