కృష్ణా పుష్కరాల ప్రాధాన్యం వివరిస్తూ 'కృష్ణమ్మ పిలిచింది'
- August 01, 2016
కృష్ణా పుష్కరాల ప్రాధాన్యం వివరిస్తూ తెనాలి వాసి, కేంద్ర సెన్సారుబోర్డు సభ్యుడు, దర్శకుడు దిలీప్ రాజా 'కృష్ణమ్మ పిలిచింది' పేరుతో లఘుచిత్రం రూపొందిస్తున్నారు. ఆలూరి సుందరరామయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం విజయవాడ లబ్బీపేటలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ప్రారంభమైంది. తొలిసన్నివేశాన్ని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామిపై దర్శకుడు దిలీప్ రాజా చిత్రీకరించారు. పుష్కరాల ప్రాధాన్యం వివరిస్తూ స్వామీజీ చెప్పిన విశేషాలు తొలి ఎపిసోడ్లో ఉంటాయని దర్శకుడు తెలిపారు. కృష్ణానది పుట్టిన ప్రదేశం నుంచి హంసలదీవిలో సాగర సంగమం చేరేవరకు ఉన్న పుణ్యక్షేత్రాల విశేషాలు చిత్రంలో ఉంటాయని వివరించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చిత్రీకరణ ముగిసిన తరువాత శాటిలైట్ ఛానల్ ద్వారా ప్రసారం చేస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







