కువైట్‌లో భారతీయులపై కేంద్రమంత్రి అక్బర్‌ ఆరా

- August 01, 2016 , by Maagulf
కువైట్‌లో భారతీయులపై కేంద్రమంత్రి అక్బర్‌ ఆరా

భారత కేంద్ర మంత్రి ఎంజె అక్బర్‌, కువైట్‌ డిప్యూటీ ఫారిన్‌ మినిస్టర్‌ ఖాలిద్‌ సులేమాన్‌ అల్‌ జరాల్లాతో టెలిఫోన్‌లో చర్చలు జరిపారు. కువైట్‌లో భారతీయుల గురించి ఈ సందర్భంగా ఇరువురి మధ్యా చర్చ జరిగింది. అలాగే ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు నేతలూ చర్చించారు. కువైట్‌లో 850,000 మందికి పైగా భారతీయులున్నారు. కువైట్‌లో వీరిదే అతి పెద్ద వలసదారుల కమ్యూనిటీగా చెప్పవచ్చు. భారత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌, తన సహచరుడు, సహాయ మంత్రి ఎంజె అక్బర్‌, కువైట్‌లోని భారతీయులకు సంబంధించిన వ్యవహారాల్ని పర్యవేక్షిస్తారని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించగా, అక్బర్‌ సోమవారం కువైట్‌ మంత్రితో మంతనాలు జరిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com