కువైట్లో భారతీయులపై కేంద్రమంత్రి అక్బర్ ఆరా
- August 01, 2016
భారత కేంద్ర మంత్రి ఎంజె అక్బర్, కువైట్ డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ ఖాలిద్ సులేమాన్ అల్ జరాల్లాతో టెలిఫోన్లో చర్చలు జరిపారు. కువైట్లో భారతీయుల గురించి ఈ సందర్భంగా ఇరువురి మధ్యా చర్చ జరిగింది. అలాగే ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు నేతలూ చర్చించారు. కువైట్లో 850,000 మందికి పైగా భారతీయులున్నారు. కువైట్లో వీరిదే అతి పెద్ద వలసదారుల కమ్యూనిటీగా చెప్పవచ్చు. భారత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, తన సహచరుడు, సహాయ మంత్రి ఎంజె అక్బర్, కువైట్లోని భారతీయులకు సంబంధించిన వ్యవహారాల్ని పర్యవేక్షిస్తారని ట్విట్టర్ ద్వారా వెల్లడించగా, అక్బర్ సోమవారం కువైట్ మంత్రితో మంతనాలు జరిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







