14 నిమిషాల్లో ఇంటివద్దకే ట్యాక్సీ
- August 01, 2016
దుబాయ్లో ట్యాక్సీలు కేవలం 14 నిమిషాల్లోనే మీ ఇంటివద్దకు వచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. ఆర్టిఎ కాల్సెంటర్లో కేవలం 34 సెకెన్లలోనే బుకింగ్ రిజిస్టర్ అవుతుందని ఆర్టిఎ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ - ట్రాన్స్పోర్ట్ యాక్టివిటీస్ మానిటరింగ్ డైరెక్టర్ అబ్దుల్లా అల్ మహ్రి చెప్పారు. ఈ ఏడాది ప్రధమార్ధంలో 2.9 మిలియన్ బుకింగ్ రిక్వెస్ట్లు వచ్చాయని ఆయన వివరించారు. తొలి ఆరు నెలల్లో 4 మిలియన్ల కాల్స్ వచ్చాయనీ, ఇందులో 1.8 మిలియన్ కాల్స్ (45 శాతం) ఐవీఆర్ సిస్టమ్ ద్వారా వచ్చాయనీ, 29,000 ట్యాక్సీ బుకింగ్స్ స్మార్ట్ ట్యాక్సీ యాప్ ద్వారా జరిగాయని వెల్లడించారు. రిజిస్టర్ చేసుకున్న తరువాత వీలైనంత త్వరగా ట్యాక్సీలను పంపించడం జరుగుతోంది. ఈ వేగాన్ని ఇంకా పెంచి, కేవలం 14 నిమిషాల్లోనే ఇంటివద్దకు ట్యాక్సీ పంపే ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెప్పారు. 15 నిమిషాల సమయం తక్కువేమీ కాదనీ, ఒక్కోసారి అంతకన్నా ఎక్కువ సమయం పడుతున్నా అది చాలా గొప్ప విషయమని ఇమ్రాన్ కురైషి అనే ఇండియన్ ఎక్స్పాట్ తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







