మస్దార్ సిటీని సందర్శించిన షేక్ మొహమ్మద్
- August 01, 2016
వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూఏఈ, రూలర్ ఆఫ్ దుబాయ్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, అబుదాబీ రిన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ మస్దార్ని సందర్శించారు. మస్దార్ సిటీలో పెద్ద సంఖ్యలో అంతర్జాతీయ సంస్థలు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాలు ఉన్నాయి. రీన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన సంస్థలే అధికం ఇక్కడ. మస్దార్ ఇనిస్టిట్యూట్ కూడా ఇందులో భాగం. ప్రపంచంలో తొలి గ్రాడ్యుయేట్ లెవల్ యూనివర్సిటీగా మస్దార్ ఇన్స్టిట్యూట్ గుర్తింపు పొందింది. మస్దార్ విజిట్ సందర్భంగా షేక్ మొహమ్మద్ మాట్లాడుతూ, సరికొత్త ఆవిష్కరణల ఆవశ్యక్తను గురించి ప్రస్తావించారు. క్లీన్ టెక్నాలజీ, రీన్యూవబుల్ ఎనర్జీ వంటి రంగాల్లో యూఏఈ గణనీయ ప్రగతి సాధిస్తోందని చెప్పారాయన. సోలార్ ఇంపల్స్ ప్రపంచమంతా చుట్టేందుకు తన ప్రయాణాన్ని యూఏఈ నుంచి ప్రారంభించి, తిరిగి యూఏఈకి క్షేమంగా చేరడం పట్ల ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు షేక్మొహమ్మద్.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







