టిటిడి విద్యాసంస్థల్లో ‘స్మార్ట్’ చదువులకు సీఎం చంద్రబాబు ఆదేశం
- March 16, 2026
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఆధ్వర్యంలోని 33 విద్యాసంస్థలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు దాదాపు రూ. 118.89 కోట్ల నిధులను కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిధులతో సుమారు 21,580 మంది విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందనున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యారంగానికి ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం విశేషం.
ఈ వినూత్న ప్రాజెక్టు ద్వారా పాఠశాలల్లో డిజిటల్ తరగతులు, అత్యాధునిక హాస్టల్ బ్లాకులు మరియు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులకు వేడినీళ్లు, నాణ్యమైన వంట సామగ్రి వంటి కనీస వసతులను మెరుగుపరుస్తూనే, పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ కూడా అందించనున్నారు. ముఖ్యంగా శ్రీపద్మావతి మహిళా విద్యాసంస్థల్లో విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. బోధన సిబ్బందికి కూడా ఆధునిక సాంకేతికతపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి విద్యా ప్రమాణాలను పెంచనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో 45 మంది డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు..!!
- తాత్కాలిక సస్పెన్షన్ తర్వాత ఫ్లైట్స్ క్రమంగా పునఃప్రారంభం..!!
- ట్రాన్స్ మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ స్టేషన్ల దగ్గర పార్కింగ్ వద్దు..!!
- అల్ బహియాలో పాలస్తీనా జాతీయుడు మృతి: అబుదాబి
- హైడ్రా ద్వారా రూ.60వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడాం..
- ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం..10 మంది రోగులు మృతి..
- టిటిడి విద్యాసంస్థల్లో ‘స్మార్ట్’ చదువులకు సీఎం చంద్రబాబు ఆదేశం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో అగ్నిప్రమాదం









