ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం..10 మంది రోగులు మృతి..
- March 16, 2026
ఒడిశా: ఎస్సీబీ వైద్య కళాశాల ఆస్పత్రి ట్రామా కేర్ ఐసీయూలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 10మంది రోగులు మృతి చెందారు. మరో 11 మందికి గాయాలయ్యాయి.గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఒడిశాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కటక్ నగరంలోని ఎస్సీబీ (SCB) మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రిలోని ట్రామా కేర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) లో సోమవారం తెల్లవారు జామున అగ్నిప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రి ట్రామా కేర్ ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 10మంది రోగులు మృతి చెందారు. వీరిలో ఏడుగురు ఐసీయూ లోపల మరణించగా.. మరో ముగ్గురు సహాయక చర్య సమయంలో ఇతర వార్డులకు తరలిస్తుండగా మరణించారు. 11మందికి గాయాలయ్యాయి. వారికి చికిత్స అందిస్తున్నారు.
అగ్నిప్రమాద ఘటన పై ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన స్థలికి చేరుకొని అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారంను సీఎం మోహన్ చరణ్ మాఝీ ప్రకటించారు. అగ్నిప్రమాదం ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు.
తాజా వార్తలు
- ‘ఈదియా’ కోసం 10 ATMలు ఏర్పాటు: అవెన్యూస్
- నిరంతర తనిఖీలతో పటిష్ఠంగా ఖతార్ మార్కెట్..!!
- బహ్రెయిన్ లో 45 మంది డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు..!!
- తాత్కాలిక సస్పెన్షన్ తర్వాత ఫ్లైట్స్ క్రమంగా పునఃప్రారంభం..!!
- ట్రాన్స్ మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ స్టేషన్ల దగ్గర పార్కింగ్ వద్దు..!!
- అల్ బహియాలో పాలస్తీనా జాతీయుడు మృతి: అబుదాబి
- హైడ్రా ద్వారా రూ.60వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడాం..
- ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం..10 మంది రోగులు మృతి..
- టిటిడి విద్యాసంస్థల్లో ‘స్మార్ట్’ చదువులకు సీఎం చంద్రబాబు ఆదేశం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత!









