ఢిల్లీలో ఐఎస్‌లో చేరేందుకు వెళ్తున్న మహిళ అరెస్ట్

- August 02, 2016 , by Maagulf
ఢిల్లీలో ఐఎస్‌లో చేరేందుకు వెళ్తున్న మహిళ అరెస్ట్

ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరేందుకు వెళ్తున్న ఓ ముస్లిం మహిళను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్ రాష్ట్రంలోని పాట్నాకు చెందిన 28 ఏళ్ళ యాస్మీన్ తన ఐదేళ్ళ కుమారుడితో కలిసి ఆదివారం కాబుల్ విమానం ఎక్కేందుకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చింది. భర్త నుంచి విడిపోయిన ఆమె నిజమైన ఇస్లాం జీవితం గడిపేందుకు ఐఎస్‌లో చేరాలని నిర్ణయించింది. గత నెల కేరళ నుంచి అదృశ్యమై ఐఎస్‌లో చేరినట్లు అనుమానిస్తున్న 21 బృందాన్ని కలిసేందుకు ఆఫ్గనిస్తాన్ వెళ్లే క్రమంలో యస్మీన్‌ను ఎయిర్ పోర్టు అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు అప్పగించగా కేరళ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఆమెను కేరళకు తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టగా జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. యస్మీన్‌ను ప్రశ్నిస్తే కేరళ నుంచి అదృశ్యమైన 21 మంది ముస్లిం యువత సమాచారం తెలిసే అవకాశముందని కేరళ పోలీసులు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com