కుప్పకూలిన ఆర్చ్...నలుగురు మృతి
- August 02, 2016
నగరంలోని నిర్మాణంలో ఉన్న ఆర్చ్ కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం కూకట్పల్లి దగ్గరలోని వసంతనగర్లో జరిగింది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా అందులో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన జనార్థన్, ధర్మారావు, నాగభూషణంగా గుర్తించారు. మరొకరు బీహార్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సహాయ కార్యక్రమాలు చేపట్టారు. దీనికి బాధ్యులైనవారిని అరెస్టు చేస్తామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







