ఢిల్లీలో ఐఎస్లో చేరేందుకు వెళ్తున్న మహిళ అరెస్ట్
- August 02, 2016
ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరేందుకు వెళ్తున్న ఓ ముస్లిం మహిళను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్ రాష్ట్రంలోని పాట్నాకు చెందిన 28 ఏళ్ళ యాస్మీన్ తన ఐదేళ్ళ కుమారుడితో కలిసి ఆదివారం కాబుల్ విమానం ఎక్కేందుకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చింది. భర్త నుంచి విడిపోయిన ఆమె నిజమైన ఇస్లాం జీవితం గడిపేందుకు ఐఎస్లో చేరాలని నిర్ణయించింది. గత నెల కేరళ నుంచి అదృశ్యమై ఐఎస్లో చేరినట్లు అనుమానిస్తున్న 21 బృందాన్ని కలిసేందుకు ఆఫ్గనిస్తాన్ వెళ్లే క్రమంలో యస్మీన్ను ఎయిర్ పోర్టు అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు అప్పగించగా కేరళ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఆమెను కేరళకు తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టగా జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. యస్మీన్ను ప్రశ్నిస్తే కేరళ నుంచి అదృశ్యమైన 21 మంది ముస్లిం యువత సమాచారం తెలిసే అవకాశముందని కేరళ పోలీసులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







