కుప్పకూలిన ఆర్చ్...నలుగురు మృతి

- August 02, 2016 , by Maagulf
కుప్పకూలిన ఆర్చ్...నలుగురు మృతి

నగరంలోని నిర్మాణంలో ఉన్న ఆర్చ్‌ కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం కూకట్‌పల్లి దగ్గరలోని వసంతనగర్‌లో జరిగింది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా అందులో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన జనార్థన్, ధర్మారావు, నాగభూషణంగా గుర్తించారు. మరొకరు బీహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సహాయ కార్యక్రమాలు చేపట్టారు. దీనికి బాధ్యులైనవారిని అరెస్టు చేస్తామని అధికారులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com