విశాఖవాసి అరెస్టు
- August 02, 2016
లాస్ ఏంజెలిస్ నుంచి నెవార్క్ వెళ్తున్న విమానంలో పక్క సీటులో కూర్చున్న మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో విశాఖపట్నానికి చెందిన కె.వీరభద్రరావు (58)ని అక్కడి పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. నెవార్క్ ఫెడరల్ కోర్టులో మేజిస్ట్రేట్ జడ్జి జోసెఫ్ డిక్సన్ ఎదుట ప్రవేశపెట్టగా, దాదాపు రూ. 33 లక్షల సెక్యూరిటీ బాండ్ సమర్పించిన తర్వాత విడుదల చేశారు. ఆయన నేరం చేసినట్లు రుజువైతే రెండేళ్ల జైలుశిక్షతో పాటు రూ. 1.67 కోట్ల జరిమానా కూడా విధించే అవకాశం ఉంది.ఆయన ప్రయాణిస్తున్న విమానం నెవార్క్కు జూలై 30న చేరగానే ఆయనను అరెస్టు చేశారు. లాస్ ఏంజెలిస్ నుంచి నెవార్క్ వెళ్తున్న విమానంలో వీరభద్రరావు మధ్యసీటులో కూర్చున్నారని, విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే తాను నిద్రపోయానని బాధితురాలు చెప్పారు. అయితే కాసేపటికి ఆయన తనను అసభ్యంగా తాకడంతో మెలకువ వచ్చిందన్నారు. దాంతో తాను తనతోపాటు వచ్చిన వ్యక్తితో కలిసి అతడితో గొడవ పడ్డానని తెలిపారు. జరిగినదంతా మర్చిపోవాలని... కావాలంటే ఒక డ్రింక్ కొనిపెడతానని ఆయన ఆఫర్ చేశారని, కానీ తాము మాత్రం దాన్ని తిరస్కరించి విమాన సి బ్బందికి జరిగిన విషయం చెప్పామని అన్నారు. దాంతో సిబ్బంది వీరభద్రరావును వేరే సీటులోకి మార్చారని, మళ్లీ ఈ సీటులోకి రావద్దని హెచ్చరించారని చెప్పారు. చివరకు విమానం ల్యాండ్ అయిన తర్వాత ఆయనను అరెస్టుచేసి, అనంతరం బెయిల్ మీద విడుదల చేశారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







