తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- March 20, 2026
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది.అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టి.. ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ 2026-27ను 3,24,234 కోట్లుతో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ. 2,34,406 కోట్లు కాగా.. మూలధన వ్యయం 47,267 కోట్లుగా భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ప్రస్తుతం 200 బిలియన్ యూఎస్ డాలర్లుగా ఉన్న ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి 1 ట్రిలియన్ యూఎస్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా.. 2047 నాటికి మూడు ట్రిలియన్ యూఎస్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ఒక మహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం విభాగాల వారీగా ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నామని భట్టి విక్రమార్క చెప్పారు.
బడ్జెట్లో కేటాయింపులు ఇలా..
♦ వ్యవసాయం-రూ.23,179 కోట్లు
♦ విద్యుత్శాఖ-రూ. 21,285 కోట్లు
♦ విద్యాశాఖ-రూ.26,674 కోట్లు
♦ మహిళ, శిక్ష సంక్షేమం-రూ.3143 కోట్లు
♦ పశుసంవర్థకశాఖ-రూ.1,529 కోట్లు
♦ సివిల్ సప్లై-రూ.7,366 కోట్లు
♦ వైద్యారోగ్యశాఖ- రూ.13,679 కోట్లు
♦ రాజీవ్ యువవికాసం- రూ. 6000 కోట్లు
♦ ఎస్సీ అభివృద్ధి- రూ.11784 కోట్లు
♦ ఎస్టీ అభివృద్ధి రూ.7937 కోట్లు
♦ మైనారిటీ సంక్షేమం- రూ.3769 కోట్లు
♦ బీసీ సంక్షేమం : రూ.12,511 కోట్లు
♦ ఇరిగేషన్ -రూ.22615 కోట్లు
♦ మున్సిపల్ శాఖ- రూ.17907 కోట్లు
♦ గృహ నిర్మాణం- రూ.7430 కోట్లు
♦ ఐటీ- రూ.875 కోట్లు
♦ చేనేత- రూ.258 కోట్లు
♦ పరిశ్రమలు- రూ. 3490 కోట్లు
♦ పంచాయతీ రాజ్- రూ.33688 కోట్లు
♦ ఆర్అండ్బీ – రూ.12789 కోట్లు
♦ న్యాయ శాఖ- రూ.2367 కోట్లు
♦ హోంశాఖ- రూ. 11907 కోట్లు
♦ టూరిజం- రూ. 1224 కోట్లు
♦ గోదావరి పుష్కరాలు -రూ.500 కోట్లు
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం: ఈ పథకాన్ని జూన్ 2 నుంచి ప్రారంభించనున్నారు. కుటుంబంలో ఆదాయం తెచ్చే వ్యక్తి దురదృష్టవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం దజేస్తారు. పేద, ధనిక అనే తేడా లేకుండా కుటుంబానికి రూ.5లక్షల జీవిత బీమా అందించే విధంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
తాజా వార్తలు
- వాహనదారులకు రవాణా శాఖ గుడ్న్యూస్
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్కు కొత్త అద్దె సూచిక.. కొత్త చట్టంతో పారదర్శకతకు ప్రాధాన్యం
- కువైట్లో వారం రోజుల్లో 25 వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- మస్కట్లో అల్ అమెరికాత్ ఓవర్పాస్ తాత్కాలికంగా మూసివేత..!!
- సోషల్ మీడియాలో పిల్లల ఫొటోల షేరింగ్ పై అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్..!!
- అమ్మాన్లో అరబ్ దేశాల కీలక సమావేశం.. ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆందోళన..!!
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే







