అమెరికాకు శ్రీలంక బిగ్ షాక్
- March 21, 2026
కొలంబో: శ్రీలంకలోని మట్టాల అంతర్జాతీయ విమానాశ్రయంలో తమ యుద్ధ విమానాలను ల్యాండ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని అమెరికా కోరినప్పటికీ, ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 4 మరియు 8 తేదీల్లో వచ్చిన రెండు వేర్వేరు అభ్యర్థనలను శ్రీలంక ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. పార్లమెంటు వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిన అధ్యక్షుడు.. అగ్రరాజ్యం నుండి ఎన్నో ఒత్తిళ్లు వచ్చినప్పటికీ తమ దేశ సార్వభౌమాధికారం మరియు తటస్థ విధానానికే మొగ్గు చూపినట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా మట్టాల ఎయిర్పోర్ట్ వ్యూహాత్మక ప్రాంతంలో ఉండటం, అక్కడ అమెరికా సైనిక కార్యకలాపాలకు తావిస్తే ప్రాంతీయ సమతుల్యత దెబ్బతింటుందనే ఆందోళనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.
ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో (Middle East) నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శ్రీలంక తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. యుద్ధ వాతావరణం సవాళ్లు విసురుతున్న తరుణంలో, ఏ ఒక్క దేశానికి లేదా కూటమికి కొమ్ముకాయకుండా ‘న్యూట్రల్’ (తటస్థంగా) ఉండటమే తమ లక్ష్యమని దిస్సనాయకే ప్రకటించారు. గతంలో అప్పుల ఊబిలో కూరుకుపోయిన సమయంలో చైనాకు అనుకూలంగా ఉందనే ముద్ర పడ్డ శ్రీలంక, ఇప్పుడు కొత్త ప్రభుత్వం హయాంలో తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని చాటుకుంటోంది. అగ్రరాజ్యాల ఒత్తిళ్లకు లొంగబోమని కుండబద్ధలు కొట్టడం ద్వారా, హిందూ మహాసముద్ర ప్రాంతంలో శ్రీలంక తన ఉనికిని మరియు ఆత్మగౌరవాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తోంది.
తాజా వార్తలు
- 1601 సిరీస్ నంబర్లను అందుబాటులోకి తెచ్చిన TRAI..!
- దశాబ్దాల సమస్యకు పరిష్కారం..830 కుటుంబాలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
- పెద్ది కుటుంబానికి కేసీఆర్ భరోసా!
- గ్లోబల్ విలేజ్ సీజన్–31.. F&B వ్యాపారాలకు రిజిస్ట్రేషన్ ప్రారంభం
- ఇక పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేదు.. డిజిటల్గా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్
- విదేశీ నగరంలో షేక్ మహ్మద్ను కలిసిన అనుభవం..కొడుకు వేసవి జ్ఞాపకాన్ని పంచుకున్న UAE అధికారి
- ఎంపీ బాలశౌరి ప్రశ్నకు కేంద్రం సమాధానం
- మలేషియాలో ఘనంగా MYTA బోనాలు 2026 వేడుకలు
- ఒమన్లో మృతి చెందిన తెలంగాణ గల్ఫ్ కార్మికుడి మృతదేహం స్వదేశానికి తరలింపు
- లొంగిపోయిన మావోయిస్టులకు అండగా ఉంటాం: డీజీపీ సీవీ ఆనంద్







