1601 సిరీస్ నంబర్లను అందుబాటులోకి తెచ్చిన TRAI..!
- August 10, 2026
న్యూ ఢిల్లీ: మొబైల్ వినియోగదారులకు వచ్చే సర్వీస్, లావాదేవీల కాల్స్ను సులభంగా గుర్తించేలా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కీలక నిర్ణయం తీసుకుంది. నాన్-బ్యాంకింగ్ సంస్థల కోసం ప్రత్యేకంగా 1601 సిరీస్ నంబర్లను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ (TRAI) చేసింది.ఈ విధానం ద్వారా సంస్థల నుంచి వచ్చే నిజమైన కాల్స్ను, అనుమానాస్పద కాల్స్ను వినియోగదారులు సులభంగా గుర్తించే అవకాశం ఉంటుంది.
యుటిలిటీస్, కొరియర్, లాజిస్టిక్స్ వంటి రంగాల్లోని సంస్థలకు:
తొలి దశలో యుటిలిటీస్, కొరియర్, లాజిస్టిక్స్ వంటి రంగాల్లోని సంస్థలకు ఈ 1601 సిరీస్ను వర్తింపజేయనున్నారు. ఆయా రంగాలకు చెందిన అర్హత కలిగిన సంస్థలు తమ కస్టమర్లకు సేవలు, లావాదేవీలకు సంబంధించిన కాల్స్ చేసేందుకు ఈ సిరీస్ నంబర్లను ఉపయోగించుకోవచ్చు. అయితే, 1601 సిరీస్ నంబర్లను అన్ని సంస్థలకు నేరుగా కేటాయించరు. టెలికాం ఆపరేటర్లు ముందుగా సంస్థల వివరాలను వెరిఫై చేస్తారు. నిర్దేశిత నిబంధనలను పాటిస్తూ అర్హత సాధించిన సంస్థలకు మాత్రమే ఈ సిరీస్ నంబర్లను కేటాయిస్తారు. దీంతో ఈ నంబర్ల వినియోగంలో పారదర్శకతతో పాటు భద్రత కూడా పెరుగుతుందని ట్రాయ్ భావిస్తోంది.
ప్రస్తుతం సాధారణ 10 అంకెల మొబైల్ నంబర్ల నుంచి వచ్చే కాల్స్ను వినియోగదారులు తరచూ అనుమానంతో చూడాల్సి వస్తోంది. కొంతమంది వ్యక్తులు, మోసగాళ్లు సాధారణ ఫోన్ నంబర్లను ఉపయోగించి బ్యాంకింగ్, సర్వీస్ లేదా ఇతర సంస్థల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో 1601 సిరీస్ ద్వారా సంస్థల అధికారిక సర్వీస్, లావాదేవీల కాల్స్కు ప్రత్యేక గుర్తింపు లభించనుంది. సాధారణ 10 అంకెల నంబర్లతో మోసాలకు పాల్పడే వారిని అడ్డుకోవడంలో ఈ విధానం ఉపయోగపడుతుందని ట్రాయ్ పేర్కొంది. మొత్తంగా, వినియోగదారుల విశ్వాసాన్ని పెంచడంతో పాటు టెలికాం రంగంలో సురక్షితమైన కమ్యూనికేషన్కు ఈ నిర్ణయం దోహదపడనుంది.
తాజా వార్తలు
- 1601 సిరీస్ నంబర్లను అందుబాటులోకి తెచ్చిన TRAI..!
- దశాబ్దాల సమస్యకు పరిష్కారం..830 కుటుంబాలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
- పెద్ది కుటుంబానికి కేసీఆర్ భరోసా!
- గ్లోబల్ విలేజ్ సీజన్–31.. F&B వ్యాపారాలకు రిజిస్ట్రేషన్ ప్రారంభం
- ఇక పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేదు.. డిజిటల్గా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్
- విదేశీ నగరంలో షేక్ మహ్మద్ను కలిసిన అనుభవం..కొడుకు వేసవి జ్ఞాపకాన్ని పంచుకున్న UAE అధికారి
- ఎంపీ బాలశౌరి ప్రశ్నకు కేంద్రం సమాధానం
- మలేషియాలో ఘనంగా MYTA బోనాలు 2026 వేడుకలు
- ఒమన్లో మృతి చెందిన తెలంగాణ గల్ఫ్ కార్మికుడి మృతదేహం స్వదేశానికి తరలింపు
- లొంగిపోయిన మావోయిస్టులకు అండగా ఉంటాం: డీజీపీ సీవీ ఆనంద్







