తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లేందుకు కొత్త హైవే
- March 23, 2026
హైదరాబాద్: తెలంగాణలోని నకిరేకల్ వద్ద ప్రారంభమై ఆంధ్రప్రదేశ్లోని ఏర్పేడు వరకు సాగే జాతీయ రహదారి 565 పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఈ హైవే అందుబాటులోకి రావడంతో నల్గొండ, ఖమ్మం, వరంగల్ ప్రాంతాల వారికి తిరుమల యాత్ర మరింత సులభం కానుంది. గతంలో ఉన్న ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోయి, ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గింది. వాహనదారులకు ఇది ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయ మార్గంగా మారింది.
యర్రగొండపాలెం సమీపంలోని 20 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ రహదారి నల్లమల అటవీ ప్రాంతం గుండా సాగుతుంది. కొండలు, లోయల మధ్య ప్రయాణికులకు ఈ మార్గం సరికొత్త అనుభూతిని పంచుతోంది. ప్రభుత్వం దాదాపు 393 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఘాట్ రోడ్డును నిర్మించింది. ప్రయాణం సాఫీగా సాగేందుకు వీలుగా ఇక్కడ మొత్తం 16 వంతెనలు, 8 అండర్పాస్లను ఏర్పాటు చేశారు.
గతంలో పుల్లలచెరువు నుంచి వెల్దుర్తి వరకు వెళ్లడానికి సుమారు 50 నిమిషాల సమయం పట్టేది, కానీ ఇప్పుడు కేవలం 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఈ హైవే మాచర్ల, మార్కాపురం, కనిగిరి, వెంకటగిరి మీదుగా సాగుతూ భక్తులను నేరుగా తిరుపతికి చేరుస్తుంది. రాత్రి వేళల్లో కూడా అటవీ ప్రాంతం గుండా సురక్షితంగా ప్రయాణించేలా అధునాతన హంగులతో ఈ రోడ్డును తీర్చిదిద్దారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







