తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లేందుకు కొత్త హైవే
- March 23, 2026
హైదరాబాద్: తెలంగాణలోని నకిరేకల్ వద్ద ప్రారంభమై ఆంధ్రప్రదేశ్లోని ఏర్పేడు వరకు సాగే జాతీయ రహదారి 565 పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఈ హైవే అందుబాటులోకి రావడంతో నల్గొండ, ఖమ్మం, వరంగల్ ప్రాంతాల వారికి తిరుమల యాత్ర మరింత సులభం కానుంది. గతంలో ఉన్న ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోయి, ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గింది. వాహనదారులకు ఇది ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయ మార్గంగా మారింది.
యర్రగొండపాలెం సమీపంలోని 20 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ రహదారి నల్లమల అటవీ ప్రాంతం గుండా సాగుతుంది. కొండలు, లోయల మధ్య ప్రయాణికులకు ఈ మార్గం సరికొత్త అనుభూతిని పంచుతోంది. ప్రభుత్వం దాదాపు 393 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఘాట్ రోడ్డును నిర్మించింది. ప్రయాణం సాఫీగా సాగేందుకు వీలుగా ఇక్కడ మొత్తం 16 వంతెనలు, 8 అండర్పాస్లను ఏర్పాటు చేశారు.
గతంలో పుల్లలచెరువు నుంచి వెల్దుర్తి వరకు వెళ్లడానికి సుమారు 50 నిమిషాల సమయం పట్టేది, కానీ ఇప్పుడు కేవలం 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఈ హైవే మాచర్ల, మార్కాపురం, కనిగిరి, వెంకటగిరి మీదుగా సాగుతూ భక్తులను నేరుగా తిరుపతికి చేరుస్తుంది. రాత్రి వేళల్లో కూడా అటవీ ప్రాంతం గుండా సురక్షితంగా ప్రయాణించేలా అధునాతన హంగులతో ఈ రోడ్డును తీర్చిదిద్దారు.
తాజా వార్తలు
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు









