సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- July 22, 2026
రియాద్: దక్షిణ సౌదీ అరేబియాను లక్ష్యంగా చేసుకుని హౌతీ మిలీషియా జరిపిన ఉగ్రదాడిని ఇటలీ, స్పెయిన్ విదేశాంగ మంత్రులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్తో ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ, స్పెయిన్ విదేశాంగ మంత్రి జోసే మాన్యుయెల్ అల్బారెస్ వేర్వేరుగా టెలిఫోన్లో చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా ప్రాంతీయ భద్రతా పరిస్థితులు, తాజా పరిణామాలపై వారు చర్చించారు. అరేబియా గల్ఫ్ మరియు ఎర్ర సముద్రంలో నౌకాయాన భద్రత, స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం ఉందని ముగ్గురు మంత్రులు అభిప్రాయపడ్డారు.
అంతర్జాతీయ వాణిజ్య నౌకల భద్రతకు, సముద్ర రవాణాకు ముప్పు కలిగించే ఎలాంటి చర్యలనైనా తాము వ్యతిరేకిస్తున్నామని వారు స్పష్టం చేశారు. ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడేందుకు అంతర్జాతీయ సహకారం కొనసాగాలని కూడా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







