అమెరికా వీసాలకు ‘ట్రంప్’ బ్రేక్
- March 23, 2026
అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వలస విధానాల ప్రభావం భారత్, చైనా దేశాలపై తీవ్రంగా పడుతోంది. ‘వాషింగ్టన్ పోస్ట్’ కథనం ప్రకారం, 2025లో వీసా జారీ ప్రక్రియలో గణనీయమైన తగ్గుదల నమోదైంది.”అమెరికా పౌరులకే తొలి ప్రాధాన్యం” అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ ప్రభుత్వం, విదేశీయులకు వీసాల జారీ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. దీనివల్ల ముఖ్యంగా భారత్, చైనా నుంచి అమెరికా వెళ్లాలనుకునే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
2024 జనవరి-ఆగస్టు కాలంతో పోలిస్తే, 2025 అదే సమయంలో 11 శాతం తక్కువగా శాశ్వత, తాత్కాలిక వీసాలను ట్రంప్ ప్రభుత్వం ఆమోదించింది.దాదాపు 2.5 లక్షల వీసాలు తక్కువగా జారీ అయ్యాయి. ఇందులో పర్యాటక వీసాలు కాకుండా విద్యార్థి, ఉపాధి (H-1B వంటివి), కుటుంబ సభ్యుల వీసాలు ఉన్నాయి.ఆ వీసాలను విద్యార్థులు, ఉపాధి కోసం వచ్చేవారు, చట్టబద్ధ నివాసితుల కుటుంబసభ్యులకు జారీ చేస్తుంటారు. టూరిస్ట్ వీసాల జారీలో కూడా గతంతో పోలిస్తే భారీగా కోత విధించినట్లు నివేదిక స్పష్టం చేసింది.
తగ్గిన ఆ 11 శాతం వీసాల్లో పర్యటక వీసాలు భాగం కాదు. ఈ ఎనిమిది నెలల కాలంలో వాటి జారీ కూడా తగ్గిపోయింది. “అమెరికా పౌరులకే తొలి ప్రాధాన్యం అనే హామీతో ట్రంప్ ఎన్నికల్లో భారీ విజయం సాధించారు. ఆయన తీసుకునే ప్రతీ నిర్ణయం దానిని ప్రతిబింబిస్తోంది” అని వైట్ హౌస్ అధికార ప్రతినిధి అబిగెయిల్ జాక్సన్ వెల్లడించారు. “సొంత ప్రజల భద్రత విషయంలో ట్రంప్ రాజీలేని వైఖరి ప్రదర్శిస్తున్నారు. అందుకే పరిశీలన(వెట్టింగ్) ఎదుర్కోని విదేశీయులను భారీ సంఖ్యలో అమెరికాలోకి అనుమతించేందుకు అధ్యక్షుడు సుముఖంగా లేరు” అని విదేశాంగ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు







