సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!

- June 22, 2026 , by Maagulf
సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!

యాన్బు: మదీనా ప్రాంతంలోని యాన్బు గవర్నరేట్‌కు చెందిన బార్డర్ గార్డ్స్ (Border Guard) ఇద్దరు పౌరులను సురక్షితంగా రక్షించారు.  సముద్రంలో వారు ప్రయాణిస్తుండగా వారి పడవ పాడైంది. దీంతో వారు సముద్రంలో చిక్కుకుపోయారు. సమాచారం అందగానే బార్డర్ గార్డ్స్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించి, వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. 

ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేసింది. సముద్రయానానికి బయలుదేరే ముందు సముద్ర భద్రతా మార్గదర్శకాలను పాటించాలని కోరింది. పడవలు ప్రయాణానికి సురక్షితంగా ఉన్నాయో లేదో బయలుదేరడానికి ముందు నిర్ధారించుకోవాలని సూచించింది.

అలాగే, అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం మక్కా, మదీనా మరియు తూర్పు ప్రావిన్స్ (Eastern Province) ప్రాంతాలలో 911 నంబర్‌ కు, ఇతర ప్రాంతాలలో 994 నంబర్‌ కు కాల్ చేయాలని బార్డర్ గార్డ్స్ సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com