ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల

- March 23, 2026 , by Maagulf
ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల

ముంబై: భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) కోసం మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశాల క్యాలెండర్‌ను ప్రకటించింది. దేశ ఆర్థిక వ్యవస్థను నియంత్రించడంలో, ముఖ్యంగా ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడంలో ఈ సమావేశాలు అత్యంత కీలకం. ఏప్రిల్ 2026 నుంచి ఫిబ్రవరి 2027 వరకు మొత్తం ఆరు విడతలుగా ఈ భేటీలు జరగనున్నాయి.

కొత్త ఆర్థిక సంవత్సరంలో మొదటి భేటీ ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభం కానుంది.

మొదటి సమావేశం: ఏప్రిల్ 6 – 8, 2026 (నిర్ణయాల వెల్లడి: ఏప్రిల్ 8)
రెండవ సమావేశం: జూన్ 3 – 5, 2026
మిగిలిన సమావేశాలు: ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్ మరియు ఫిబ్రవరి మాసాల్లో నిర్వహించనున్నారు.
ప్రతి రెండు నెలలకు ఒకసారి జరిగే ఈ మూడు రోజుల చర్చల అనంతరం, చివరి రోజున ఆర్బీఐ గవర్నర్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను అధికారికంగా వెల్లడిస్తారు.

దేశంలోని ద్రవ్యోల్బణం (Inflation) పరిస్థితులను బట్టి బ్యాంకులు ఆర్బీఐ వద్ద తీసుకునే రుణాలపై వడ్డీ రేటును (Repo Rate) ఈ కమిటీ నిర్ణయిస్తుంది. ఇందులో మొత్తం ఆరుగురు సభ్యులు ఉంటారు. ఆర్బీఐ గవర్నర్ ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.ధరల స్థిరత్వాన్ని కాపాడటం మరియు ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వడం ఈ కమిటీ ప్రధాన ఉద్దేశ్యం. ఫిబ్రవరి 2026లో జరిగిన గత సమావేశంలో రెపో రేటును యథాతథంగా ఉంచిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com