ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- March 23, 2026
ముంబై: భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) కోసం మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశాల క్యాలెండర్ను ప్రకటించింది. దేశ ఆర్థిక వ్యవస్థను నియంత్రించడంలో, ముఖ్యంగా ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడంలో ఈ సమావేశాలు అత్యంత కీలకం. ఏప్రిల్ 2026 నుంచి ఫిబ్రవరి 2027 వరకు మొత్తం ఆరు విడతలుగా ఈ భేటీలు జరగనున్నాయి.
కొత్త ఆర్థిక సంవత్సరంలో మొదటి భేటీ ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభం కానుంది.
మొదటి సమావేశం: ఏప్రిల్ 6 – 8, 2026 (నిర్ణయాల వెల్లడి: ఏప్రిల్ 8)
రెండవ సమావేశం: జూన్ 3 – 5, 2026
మిగిలిన సమావేశాలు: ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్ మరియు ఫిబ్రవరి మాసాల్లో నిర్వహించనున్నారు.
ప్రతి రెండు నెలలకు ఒకసారి జరిగే ఈ మూడు రోజుల చర్చల అనంతరం, చివరి రోజున ఆర్బీఐ గవర్నర్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను అధికారికంగా వెల్లడిస్తారు.
దేశంలోని ద్రవ్యోల్బణం (Inflation) పరిస్థితులను బట్టి బ్యాంకులు ఆర్బీఐ వద్ద తీసుకునే రుణాలపై వడ్డీ రేటును (Repo Rate) ఈ కమిటీ నిర్ణయిస్తుంది. ఇందులో మొత్తం ఆరుగురు సభ్యులు ఉంటారు. ఆర్బీఐ గవర్నర్ ఈ కమిటీకి ఛైర్మన్గా వ్యవహరిస్తారు.ధరల స్థిరత్వాన్ని కాపాడటం మరియు ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వడం ఈ కమిటీ ప్రధాన ఉద్దేశ్యం. ఫిబ్రవరి 2026లో జరిగిన గత సమావేశంలో రెపో రేటును యథాతథంగా ఉంచిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- వినియోగదారుల రక్షణ కఠినమైన జరిమానాలు..!!
- మే 15 నుండి అబుదాబిలో డెలివరీ మోటార్సైకిళ్లపై నిషేధం..!!
- హంటావైరస్ ప్రమాదం చాలా తక్కువ.. సౌదీ అరేబియా
- వలస కార్మికుల హక్కుల పరిరక్షణకు జాతీయ విధానం..!!
- అమెరికా ఉపాధ్యక్షుడితో ఖతార్ పీఎం భేటీ..!!
- గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లుల తగ్గింపు..!!
- IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ ఘనవిజయం
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్
- యూఏఈలో ప్రత్యక్ష లేదా దూర విద్య పై మే 10న నిర్ణయం
- విదేశీ చదువులకు పావలా వడ్డీ రుణాలు..సీఎం కీలక నిర్ణయం









