యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- March 25, 2026
యూఏఈ: యూఏఈలో రాబోయే రెండు రోజుపాటు అస్థిరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. దీనితో పాటు భారీ వర్షాలు, ఉరుములు మరియు బలమైన గాలులు వీస్తాయి. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాత్రికి పరిస్థితులు క్రమంగా మెరుగుపడి, వర్షం పడే అవకాశం తగ్గుతుందని జాతీయ వాతావరణ కేంద్రం తాజా అప్డేట్ లో ప్రకటించింది.
నివాసితుల భద్రత పరమైన గైడ్ లైన్స్ ను ఫాలో కావాలని అధికారులు సూచించారు. స్మార్ట్ పార్కింగ్ యార్డులు మినహా షార్జాలో పబ్లిక్ పార్కింగ్ ఉచితంగానే కొనసాగుతుందని గుర్తుచేశారు.
దుబాయ్ ఆర్టీఏ హెచ్చరికలు
దుబాయ్ లో రాబోయే మరికొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని దుబాయ్ రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) తెలిపింది. వర్షం పడుతున్నప్పుడు, పగటిపూట కూడా విజిబిలిటీ గణనీయంగా తగ్గిపోతుందని హెచ్చరించింది. ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని, ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, జాగ్రత్తగా వాహనాలు నడపాలని కోరుతూ ఒక సలహా జారీ చేసింది.
వెదర్ రాడార్ విశ్లేషణ
యూఏఈ లో వర్షాలు, వడగళ్ళు కురుస్తాయని అంచనా వేస్తున్న నేపథ్యంలో యూఏఈ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. వివిధ స్థాయిలలో వర్షపాతాన్ని సూచిస్తున్న వాతావరణ రాడార్ ప్రకారం.. ప్రస్తుతానికి యూఏఈకి నైరుతి దిశలో సముద్రంపై ఒక తుఫాను వ్యవస్థ అభివృద్ధి చెందుతోంది.
రెడ్ మరియు ఎల్లో జోన్లలో తీవ్రమైన వర్షపాతం కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతానికి, ఇది యూఏఈ తీరప్రాంతం వైపు పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. దీని మార్గంలో దుబాయ్ మరియు ఉత్తర ఎమిరేట్స్ లో తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
తూర్పు యూఏఈ మరియు ఒమన్లోని లోతట్టు ప్రాంతాలలో కూడా తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉంది. దీంతో ఆ ప్రాంతమంతటా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని సూచించారు.
ప్రభావిత ప్రాంతాలలో భారీ వర్షం, ఉరుములు, మరియు బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. అత్యంత తీవ్రమైన జోన్లలో స్థానికంగా వరదలు సంభవించే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషించారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









