రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- March 26, 2026
న్యూ ఢిల్లీ: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ యుద్ధం వల్ల దేశంపై పడే ప్రభావం, భవిష్యత్తు పరిణామాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ భేటీలో యుద్ధ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి రాష్ట్రాలకు ప్రధాని కీలక సూచనలు చేయనున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో చమురు, గ్యాస్ సరఫరాకు ఆటంకాలు ఏర్పడే ప్రమాదం ఉందని పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఈ అంశంపై మాట్లాడిన ఆయన, యుద్ధం వల్ల ఇంధన సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని, ఇది భారత్కు కూడా సవాలుగా మారిందని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువులు వంటి అత్యవసర వస్తువుల సరఫరా మార్గాలకు ఆటంకం కలగకుండా చూడటం ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యం. అయితే, దేశంలో సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని, ఇంధన భద్రత విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని అఖిలపక్ష సమావేశం ఇప్పటికే స్పష్టత ఇచ్చింది.
తాజా వార్తలు
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!
- ఖతార్ లో అస్థిర వాతావరణం..కార్మిక మంత్రిత్వ శాఖ గైడ్ లైన్స్ జారీ..!!
- CBSE న్యూ గ్రేడింగ్ సిస్టమ్
- సౌదీ అరేబియా వ్యాప్తంగా భారీ వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- మెట్రో, ఎసి, డీలక్స్ బస్సుల్లో 30% రాయితీ









