బిదియాలో ప్రమాదకరంగా వాగు దాటిన ఇద్దరు అరెస్టు..!!
- March 28, 2026
మస్కట్: బిదియాలోని ఒక వాడీని దాటేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఒమన్ పౌరులను అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో వారి వాహనాలు బలమైన ప్రవాహాలకు కొట్టుకుపోయాయని, వారిని సంబంధిత న్యాయాధికారులకు అప్పగించినట్లు తెలిపింది.
పోలీసుల ప్రకారం, ఈ ఘటన వారి ప్రాణాలను ప్రమాదంలో పడవేయడమే కాకుండా, ఆపరేషన్లో పాల్గొన్న సహాయక బృందాల భద్రతను కూడా ప్రమాదంలో పడేసింది. సంబంధిత చట్టాల ప్రకారం ఆ వ్యక్తులపై న్యాయపరమైన చర్యలు చేపట్టేందుకు ఆదేశించారు.
వరద నీటితో నిండిన వాగులను దాటేందుకు ప్రయత్నించవద్దని రాయల్ ఒమన్ పోలీసులు వాహనదారులను మరోసారి హెచ్చరించారు. అటువంటి చర్యలు ప్రాణాలకు, ఆస్తులకు తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తాయని చెప్పారు. సంబంధిత అధికారులు జారీ చేసిన భద్రతా సూచనలను పాటించాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







