బిగ్ టికెట్లో బంగారు బార్స్ ను గెలుచుకున్న భారతీయులు..!!
- March 28, 2026
యూఏఈ: మార్చిలో జరిగిన బిగ్ టికెట్ మూడవ వారపు ఇ-డ్రాలో కేరళకు చెందిన ముగ్గురు భారతీయులు మరియు ఒక పాకిస్తానీ జాతీయుడు నాలుగు 200-గ్రాముల, 24-క్యారెట్ల బంగారు కడ్డీల అదృష్ట విజేతలుగా నిలిచారు.
ఈ నెల బిగ్ టికెట్ ప్రమోషన్లో ప్రధాన ఆకర్షణగా 20 మిలియన్ దిర్హమ్ల భారీ బహుమతి ఉంది. దీనిని ఏప్రిల్ 3న జరిగే లైవ్ డ్రాలో ప్రదానం చేయనున్నారు.
గ్రాండ్ ప్రైజ్తో పాటు, లైవ్ డ్రా సమయంలో ఐదుగురు పార్టిసిపెంట్లు ఒక్కొక్కరు 200 గ్రాముల, 24-క్యారెట్ల బంగారు కడ్డీని కన్సోలేషన్ ప్రైజ్లుగా గెలుచుకుంటారు. ఈ మార్చిలో వారపు ఇ-డ్రా ఒక్కటే మిగిలి ఉంది. దీనిలో నలుగురు విజేతలు ఒక్కొక్కరు 200 గ్రాముల, 24-క్యారెట్ల బంగారు కడ్డీని అందుకుంటారు. బిగ్ టికెట్ వారి డ్రీమ్ కార్ సిరీస్లో, ఏప్రిల్ 3న జరిగే డ్రాలో ఒక విజేత మసెరటి గ్రెకేల్ కారును ఇంటికి తీసుకువెళ్తారు.
బంగారు కడ్డీల విజేతలు వివరాలు
54 ఏళ్ల సునీష్ కృష్ణన్ బాలకృష్ణన్కు ఈ బిగ్ టికెట్ విజయం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఎనిమిదేళ్లుగా ఈ రాఫిల్లో పాల్గొంటున్న అతనికి ఇది మొదటి విజయం. కేరళకు చెందిన, దుబాయ్లో నివసిస్తున్న ఈ సేల్స్ ప్రొఫెషనల్, తనకు అదృష్టాన్ని తెస్తుందని తాను నమ్మే ఒక వ్యక్తిగత సంప్రదాయాన్ని పాటించేవాడినని వెల్లడించారు. తను 3తో ముగిసే సంఖ్యలను ఎంచుకునేవాడు.
తనతో పాటు పాల్గొన్న నలుగురు సన్నిహిత మిత్రులతో బహుమతిని పంచుకుంటానని చెప్పాడు. బహుమతిలో తన వాటాతో, తనకు ఎంతో ఇష్టమైన భారతదేశంలోని ఒక అనాథాశ్రమానికి సహాయం చేయాలని అతను యోచిస్తున్నాడు. విజయం గురించిన ఫోన్ కాల్ అందుకున్న క్షణాన్ని గుర్తుచేసుకుంటూ సునీష్ “నేను ఎప్పటికైనా గెలుస్తానని నాకు ఎప్పుడూ ఆశ ఉండేది. ఈ గెలుపు ఆ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి నింపింది.” అని పేర్కొన్నాడు.
కేరళకు చెందిన 42 ఏళ్ల శరత్ బాలన్ గత కొన్నేళ్లుగా రాఫిల్లో పాల్గొంటున్నాడు. చివరకు తన మొదటి విజయాన్ని జరుపుకుంటున్నారు. గత 20 ఏళ్లుగా తన కుటుంబంతో కలిసి దుబాయ్లో నివసిస్తున్న ఈ వ్యాపారవేత్త, తన అదృష్టం గురించి తెలియజేయడానికి వచ్చిన మొదటి కాల్ను తాను మిస్ అయ్యానని చెప్పారు. "నేను సమావేశంలో ఉన్నందున మొదటి కాల్ తీయలేదు. తర్వాత నిర్ధారించుకోవడానికి ఆన్లైన్లో చూసుకోగా, నేనే గెలిచానని తెలిసి ఆశ్చర్యపోయాను," అని బాలన్ అన్నారు.
ఈ ఇ-డ్రాలో నాల్గవ విజేత కేరళకు చెందిన 30 ఏళ్ల డాక్టర్ మహమ్మద్ ఇబ్రహీం. ఆయన గత మూడేళ్లుగా బిగ్ టికెట్లో పాల్గొంటున్నారు. ఆయన తన ఆరుగురు స్నేహితుల బృందంతో కలిసి ప్రతి నెలా టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నారు. “మా నాన్నగారు 20 ఏళ్లకు పైగా టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నారు. మా సోదరుడు యూఏఈలో పనిచేస్తాడు. నేను వారి ద్వారానే బిగ్ టికెట్ గురించి మొదటిసారి విని, మూడేళ్ల క్రితం కొంతమంది స్నేహితులతో కలిసి ఇందులో పాల్గొనాలని నిర్ణయించుకున్నాను.” అని మహమ్మద్ తన జర్నీ గురించి చెప్పాడు. తనకు గెలవడం ఇదే మొదటిసారి. అందుకే నాకు ఫోన్ కాల్ వచ్చినప్పుడు, అది ఒక అద్భుతమైన అనుభూతి. నేను ఏమి అనుభూతి చెందానో పూర్తిగా చెప్పలేను. అది నాకు మరియు నా కుటుంబానికి బహుమతిని తన బృందంలోని వారందరికీ పంచుతామని, ఈ ఏడాది చివర్లో కెనడాకు వెళ్లడానికి సిద్ధమవుతున్నందున తన వాటాను పొదుపు చేయాలని యోచిస్తున్నట్లు అతను తెలిపాడు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







