మిడిలీస్టులో యుద్ధ పరిణామాల పై సమావేశం..పాల్గొన్న ఒమన్..!!

- March 31, 2026 , by Maagulf
మిడిలీస్టులో యుద్ధ పరిణామాల పై సమావేశం..పాల్గొన్న ఒమన్..!!

మస్కట్: గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాలు, రష్యన్ ఫెడరేషన్ మరియు  జోర్డాన్‌లతో కలిసి వీడియో-కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన విదేశాంగ మంత్రుల సమావేశంలో ఒమన్ సుల్తానేట్ పాల్గొన్నది. ఈ సమావేశంలో ఒమన్ సుల్తానేట్ తరపున విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైదీ పాల్గొన్నారు.

ఇరాన్‌ పై ఇజ్రాయెల్-అమెరికా చేస్తున్న యుద్ధానికి సంబంధించిన ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై మంత్రులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. యుద్ధం వల్ల తీవ్రమవుతున్న మానవతా పరిణామాలు, హోర్ముజ్ జలసంధి ద్వారా ఇంధన సరఫరా మరియు అంతర్జాతీయ సముద్రయానానికి అంతరాయాలు ఏర్పడటం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రతికూల ప్రభావాలపై వారు చర్చించారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com