రేపటి నుంచి ఆకస్మిక తనిఖీలు చేయనున్న సీఎం చంద్రబాబు

- March 31, 2026 , by Maagulf
రేపటి నుంచి ఆకస్మిక తనిఖీలు చేయనున్న సీఎం చంద్రబాబు

అమరావతి: అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు బిగ్ అలర్ట్ ప్రకటించారు. ఏప్రిల్ నుంచి ఆకస్మిక తనిఖీలు ఉంటాయని హెచ్చరించారు. బాగా పని చేయని అధికారులను ప్రజల ముందే నిలదీస్తామని చెప్పారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి ప్రజలు మెచ్చే పాలన చేయాలని సూచించారు. ఎమ్మెల్యేలు బాగా పని చేయాలని, లేనిపక్షంలో మొహమాటం లేకుండా నిలదీస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఆ మేరకు ఆయన “ఎక్స్” పోస్ట్ చేసారు.

సంక్షేమ పథకాల అమలుకు టెక్నాలజీని ఉపయోగించుకోవాలని ఈ పోస్టులో అధికారులకు సూచించారు. పెన్షన్ పంపిణీని రియల్ టైమ్ మానిటర్ చేస్తున్నామని తెలిపారు. కొంతమంది అధికారులకు సమర్థవంతంగా పని చేస్తున్నారని చెప్పా రు. బాగా పని చేస్తున్న అధికారులను తాను అబినందిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. వర్క్ చేయని అధికారులతో పని చేయిస్తానని, అది తన బాధ్యత అని చంద్రబాబు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com