రేపటి నుంచి ఆకస్మిక తనిఖీలు చేయనున్న సీఎం చంద్రబాబు
- March 31, 2026
అమరావతి: అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు బిగ్ అలర్ట్ ప్రకటించారు. ఏప్రిల్ నుంచి ఆకస్మిక తనిఖీలు ఉంటాయని హెచ్చరించారు. బాగా పని చేయని అధికారులను ప్రజల ముందే నిలదీస్తామని చెప్పారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి ప్రజలు మెచ్చే పాలన చేయాలని సూచించారు. ఎమ్మెల్యేలు బాగా పని చేయాలని, లేనిపక్షంలో మొహమాటం లేకుండా నిలదీస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఆ మేరకు ఆయన “ఎక్స్” పోస్ట్ చేసారు.
సంక్షేమ పథకాల అమలుకు టెక్నాలజీని ఉపయోగించుకోవాలని ఈ పోస్టులో అధికారులకు సూచించారు. పెన్షన్ పంపిణీని రియల్ టైమ్ మానిటర్ చేస్తున్నామని తెలిపారు. కొంతమంది అధికారులకు సమర్థవంతంగా పని చేస్తున్నారని చెప్పా రు. బాగా పని చేస్తున్న అధికారులను తాను అబినందిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. వర్క్ చేయని అధికారులతో పని చేయిస్తానని, అది తన బాధ్యత అని చంద్రబాబు చెప్పారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







