రేపటి నుంచి ఆకస్మిక తనిఖీలు చేయనున్న సీఎం చంద్రబాబు
- March 31, 2026
అమరావతి: అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు బిగ్ అలర్ట్ ప్రకటించారు. ఏప్రిల్ నుంచి ఆకస్మిక తనిఖీలు ఉంటాయని హెచ్చరించారు. బాగా పని చేయని అధికారులను ప్రజల ముందే నిలదీస్తామని చెప్పారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి ప్రజలు మెచ్చే పాలన చేయాలని సూచించారు. ఎమ్మెల్యేలు బాగా పని చేయాలని, లేనిపక్షంలో మొహమాటం లేకుండా నిలదీస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఆ మేరకు ఆయన “ఎక్స్” పోస్ట్ చేసారు.
సంక్షేమ పథకాల అమలుకు టెక్నాలజీని ఉపయోగించుకోవాలని ఈ పోస్టులో అధికారులకు సూచించారు. పెన్షన్ పంపిణీని రియల్ టైమ్ మానిటర్ చేస్తున్నామని తెలిపారు. కొంతమంది అధికారులకు సమర్థవంతంగా పని చేస్తున్నారని చెప్పా రు. బాగా పని చేస్తున్న అధికారులను తాను అబినందిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. వర్క్ చేయని అధికారులతో పని చేయిస్తానని, అది తన బాధ్యత అని చంద్రబాబు చెప్పారు.
తాజా వార్తలు
- తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్..ఎవరికి ఏ శాఖ?
- మల్కాజిగిరి కమిషనరేట్లో పోక్సో చట్టం అమలు పై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం
- హయాకోమ్.. వరదల ఆందోళనలపై చర్చ..!!
- రియాద్ మెట్రో వెస్ట్రన్ స్టేషన్ ప్రారంభం..!!
- జనన, మరణ రిజిస్ట్రేషన్..వర్కింగ్ అవర్స్ ప్రకటించిన MoPH..!!
- సోషల్ మీడియాలో బంధువు ఫోటోలు పోస్ట్.. Dh3,000 ఫైన్..!!
- యంగ్ లీడర్స్.. మస్కట్ లో జాతీయ కార్యక్రమం ప్రారంభం..!!
- ఫ్లైట్ లో ప్రయాణికుడిని రక్షించిన యూఏఈ నర్సు..!!
- మే 23 నుండి బెంగళూరు–ముంబై కొత్త రైలు ప్రారంభం!
- SRH vs RCB మ్యాచ్ టికెట్ల పేరిట కొత్త సైబర్ దందా.. సీపీ సజ్జనార్ హెచ్చరిక!









