దుబాయ్ లో కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి..!!
- March 31, 2026
కువైట్: కువైట్ ముడి ఆయిల్ సూపర్ ట్యాంకర్ “అల్-సల్మీ”పై మార్చి 31తెల్లవారుజామున ఇరాన్ దురుద్దేశపూర్వకంగా దాడి చేసిందని కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ (KPC) ప్రకటించింది. యూఏఈలోని దుబాయ్ పోర్టులో ఈ నౌక నిలిపిఉన్న సమయంలో తెల్లవారుజామున 12:10 గంటలకు ఈ సంఘటన జరిగిందని పేర్కొంది.
దాడి జరిగిన సమయంలో ట్యాంకర్ పూర్తిగా సరుకుతో నిండి ఉందని KPC తెలిపింది. ఈ దాడి కారణంగా షిప్ బయటి భాగానికి నష్టం వాటిల్లడంతో పాటు, షిప్ లోపల మంటలు చెలరేగాయని పేర్కొంది. దీంతో ఆయిల్ ట్యాంకర్ చుట్టుపక్కల జలాల్లో చమురు లీకేజీ అయ్యే ప్రమాదంపై ఆందోళనలు ఉన్నాయని తెలిపింది.
అత్యవసర సహాయక బృందాలు ప్రస్తుతం సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ మంటలను అదుపులోకి తెచ్చి, ఆర్పివేసేందుకు కృషి చేస్తున్నారని పేర్కొంది. ఈ దాడి ఫలితంగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని కార్పొరేషన్ వెల్లడించింది. ఆయిల్ ట్యాంకర్ ను కాపాడటానికి మరియు పర్యావరణ ప్రమాదాన్ని నివారించడానికి అవసరమైన చర్యలతో పాటు జరిగిన నష్టంపై విచారణ జరుగుతోందని తెలిపింది.
తాజా వార్తలు
- పార్టనర్షిప్ బలోపేతానికి సౌదీ అరేబియా, కెనడా చర్చలు..!!
- జెరూసలేంలో ఇజ్రాయెల్ ఆంక్షలు..ఖండించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- దుబాయ్ లో కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి..!!
- ఒమన్ పై ద్రోణి ఎఫెక్ట్..రెండు రోజులపాటు వర్షాలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- రీఫండ్, తేదీ మార్పులకు ఖతార్ ఎయిర్వేస్ అవకాశం..!!
- VerSe Innovation లో ఇండిపెండెంట్ డైరెక్టర్గా పి.ఆర్.రమేష్ నియామకం
- TANA ప్రపంచ సాహిత్యవేదిక 90వ సమావేశం ఘన విజయం
- అమెరికా పర్యటనకు కేటీఆర్
- శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ సీజ్









