దుబాయ్ లో కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి..!!
- March 31, 2026
కువైట్: కువైట్ ముడి ఆయిల్ సూపర్ ట్యాంకర్ “అల్-సల్మీ”పై మార్చి 31తెల్లవారుజామున ఇరాన్ దురుద్దేశపూర్వకంగా దాడి చేసిందని కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ (KPC) ప్రకటించింది. యూఏఈలోని దుబాయ్ పోర్టులో ఈ నౌక నిలిపిఉన్న సమయంలో తెల్లవారుజామున 12:10 గంటలకు ఈ సంఘటన జరిగిందని పేర్కొంది.
దాడి జరిగిన సమయంలో ట్యాంకర్ పూర్తిగా సరుకుతో నిండి ఉందని KPC తెలిపింది. ఈ దాడి కారణంగా షిప్ బయటి భాగానికి నష్టం వాటిల్లడంతో పాటు, షిప్ లోపల మంటలు చెలరేగాయని పేర్కొంది. దీంతో ఆయిల్ ట్యాంకర్ చుట్టుపక్కల జలాల్లో చమురు లీకేజీ అయ్యే ప్రమాదంపై ఆందోళనలు ఉన్నాయని తెలిపింది.
అత్యవసర సహాయక బృందాలు ప్రస్తుతం సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ మంటలను అదుపులోకి తెచ్చి, ఆర్పివేసేందుకు కృషి చేస్తున్నారని పేర్కొంది. ఈ దాడి ఫలితంగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని కార్పొరేషన్ వెల్లడించింది. ఆయిల్ ట్యాంకర్ ను కాపాడటానికి మరియు పర్యావరణ ప్రమాదాన్ని నివారించడానికి అవసరమైన చర్యలతో పాటు జరిగిన నష్టంపై విచారణ జరుగుతోందని తెలిపింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







