కేటీ జలీల్ను సౌదీ పంపనున్న కేరళ....
- August 04, 2016
సౌదీ అరేబియాలో ఉద్యోగం కోల్పోయి అవస్థలు పడుతున్న కేరళీయుల పరిస్థితిని తెలుసుకోవడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి కేటీ జలీల్ను సౌదీ పంపనుంది. రాష్ట్ర మంత్రివర్గం బుధవారం జరిగిన సమావేశంలో మంత్రి జలీల్ను, ప్రత్యేక కార్యదర్శి వీకే బేబీని సౌదీ పంపనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 200 మంది కేరళీయులు లేబర్ క్యాంపుల్లో పని చేస్తున్నారన్నారు. ఇప్పుడు వారు ఉద్యోగం కోల్పోయి తినడానికి కూడా ఏమి లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వారి సమస్యలను నేరుగా తెలుసుకునేందుకే అక్కడికి వెళ్తున్నట్లు జలీల్ తెలిపారు. .
సౌదీలో చమురు ధరలు తగ్గడం వల్ల వ్యాపారం నష్టాల్లో కూరుకు పోవడంతో అక్కడి సంస్థలు కార్మికులకు సరిగా వేతనాలు ఇవ్వడం లేదు. దాదాపు 10వేల మంది భారతీయులు నిరుద్యోగులుగా మారారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







