కేటీ జలీల్ను సౌదీ పంపనున్న కేరళ....
- August 04, 2016
సౌదీ అరేబియాలో ఉద్యోగం కోల్పోయి అవస్థలు పడుతున్న కేరళీయుల పరిస్థితిని తెలుసుకోవడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి కేటీ జలీల్ను సౌదీ పంపనుంది. రాష్ట్ర మంత్రివర్గం బుధవారం జరిగిన సమావేశంలో మంత్రి జలీల్ను, ప్రత్యేక కార్యదర్శి వీకే బేబీని సౌదీ పంపనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 200 మంది కేరళీయులు లేబర్ క్యాంపుల్లో పని చేస్తున్నారన్నారు. ఇప్పుడు వారు ఉద్యోగం కోల్పోయి తినడానికి కూడా ఏమి లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వారి సమస్యలను నేరుగా తెలుసుకునేందుకే అక్కడికి వెళ్తున్నట్లు జలీల్ తెలిపారు. .
సౌదీలో చమురు ధరలు తగ్గడం వల్ల వ్యాపారం నష్టాల్లో కూరుకు పోవడంతో అక్కడి సంస్థలు కార్మికులకు సరిగా వేతనాలు ఇవ్వడం లేదు. దాదాపు 10వేల మంది భారతీయులు నిరుద్యోగులుగా మారారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









