కిడ్నాప్ కు గురైన భారతీయ బాలిక క్షేమంగా ఇంటికి చేరుకొంది.
- August 04, 2016
మనామా: హోరా లో గత మంగళవారం రాత్రి ఓ భారతీయ బాలికను అపహరణకు గురైన విషయం "మా గల్ఫ్ డాట్ కామ్" పాఠకులకు విదితమే . ఐదు ఏళ్ల సారా తీవ్ర ఉత్కంఠ తో కూడిన 24 గంటల తర్వాత కుటుంబంతో ఏకమయ్యారు. సారా తల్లి చల్లని స్టోర్ నుండి నీటిని కొనుగోలు చేసేందుకు కారు బయటకు వెళ్ళిన సమయంలో మంగళవారం రాత్రి ఆమె కుమార్తెని కారును దుండగులుఅపహరించారు.ఈ అపహరణలో ప్రధాన నిందితులైన ఒక పురుషుడు మరియు ఒక మహిళ కారు దొంగతనం చేయడంలోనే నిమగ్నమైనట్లు ఆ తర్వాత వారు ఆ కారులో కూర్చున్న బాలికని గుర్తించడం జరిగిందని అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. ఆ నిందితుల ఇరువురి పేర్లు గుర్తింపులు బహిర్గతం కాకుండా వారిని అదుపులోనికి తీసుకొన్నట్లు పేర్కొంది.ఈ సందర్భంగా కాపిటల్ గవర్నరేట్ పోలీస్ జనరల్ డైరెక్టరేట్ కల్నల్ ఖలీద్ అల్ తవాది మాట్లాడుతూ కిడ్నాప్ చేసినవారు ఒక బహ్రేయినీ వ్యక్తి (38), మరియు ఒక ఆసియా మహిళ(37) గా తెలియచేసారు.ఈ బాలికని వేఠేకెందుకు 25 గస్తీ వాహనాల బృందం అన్వేషణ జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు గూర్చి తెలియడమే వారు దర్యాప్తుని వేగవంతంగా ప్రారంభించారు. కిడ్నాప్ చేసినవారిని గుర్తించారు. సారాతో వెళ్లిన కారులో ఉన్న ఓ మహిళా పాపని తీసుకువెళ్లి హోరా లో ఉన్న తన ఇంటిలో దాచినట్లు కనుగొనబడింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు ఈ కిడ్నాప్ సంఘటన గురించి తెలిపినట్లు మరియు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని "కల్నల్ అల్ తవాది పేర్కొన్నారు. పాప బాబాయి అనీష్ చార్లెస్, ఈ సందర్భంగా మాట్లాడుతూ, పాప దొరికినట్లు ఆమె గూర్చి సంతోషకరమైన వార్తని పోలీసులు ధ్రువీకరించారు. వారు గత రాత్రి హోరా పోలీసు స్టేషన్ నుండి సారాని తీసుకొనివచ్చారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







