చెన్నై-పళని ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది..
- August 04, 2016
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో చెన్నై-పళని ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. జిల్లాలోని దసంపట్టి ప్రాంతంలో రాత్రి సమయంలో రైలు ఇంజను, రెండు బోగీలు పట్టాలు తప్పాయి. అదృష్టవశాత్తు ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. సంఘటనలో ఎవరూ గాయపడలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ఈ సంఘటన కారణంగా దాదాపు మూడు గంటలపాటు ఆ మార్గంలో రైళ్లను నిలిపేసి తర్వాత తిరిగి ప్రారంభించారు. ప్రయాణికులను మరో రైలులో గమ్యస్థానాలకు పంపించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









