కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- April 01, 2026
కువైట్: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం పై బుధవారం తెల్లవారుజామున డ్రోన్ దాడి జరిగిందని, ఈ దాడిని ఇరాన్ మరియు దాని అనుబంధ సాయుధ బృందాలు జరిపినట్లు అనుమానాలు ఉన్నాయని జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ వెల్లడించింది.
కువైట్ ఏవియేషన్ ఫ్యూయలింగ్ కంపెనీ నిర్వహిస్తున్న ఇంధన నిల్వ ట్యాంకులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని, దీంతో ఆ ప్రదేశంలో భారీ అగ్నిప్రమాదం సంభవించిందని అధికార ప్రతినిధి అబ్దుల్లా అల్-రాజీ తెలిపారు.
అత్యవసర సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని, మంటలను అదుపులోకి తెచ్చేందుకు కృషి చేశాయి.ఈ ఘటనలో ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. అయితే, ఎవరూ గాయపడిన ఘటనలు నమోదు కాలేదని వెల్లడించారు.
కీలకమైన మౌలిక సదుపాయాలను పరిరక్షించడానికి మరియు విమానాశ్రయ కార్యకలాపాల భద్రతను నిర్ధారించడానికి అధికారులు క్షత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని ఏవియేషన్ అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







