కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- July 10, 2026
కువైట్ : కువైట్లో రెసిడెన్సీ నిబంధనలను ఉల్లంఘించిన వారి మొత్తం సంఖ్య 2025లో స్వల్పంగా తగ్గినప్పటికీ, కొత్తగా నమోదైన ఉల్లంఘనల సంఖ్య మాత్రం పెరిగినట్లు కేంద్ర గణాంకాల బ్యూరో (Central Statistical Bureau) విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి.
2025లో 11,700 కొత్త రెసిడెన్సీ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. 2024లో ఈ సంఖ్య 10,700గా ఉండగా, ఏడాది వ్యవధిలో పెరుగుదల నమోదైంది. అయినప్పటికీ, మొత్తం ఉల్లంఘనదారుల సంఖ్య 81,500 నుంచి 80,800కు తగ్గింది. ఉల్లంఘనదారుల చట్టపరమైన హోదాను సరిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కొనసాగుతున్నట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
ఇదే సమయంలో, కువైట్లో ప్రవాసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 2025 చివరి నాటికి చెల్లుబాటులో ఉన్న రెసిడెన్సీ పర్మిట్ల సంఖ్య 3.166 మిలియన్లకు చేరుకుంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 1.42 లక్షల పర్మిట్లు అధికం, వార్షికంగా 4.7 శాతం వృద్ధి నమోదైనట్లు నివేదిక తెలిపింది. మరోవైపు, రద్దు చేసిన రెసిడెన్సీ పర్మిట్ల సంఖ్య 49,700 నుంచి 47,200కు తగ్గింది. ఇది వార్షికంగా 5 శాతం తగ్గుదలను సూచిస్తోంది.
చెల్లుబాటులో ఉన్న రెసిడెన్సీ పర్మిట్లలో ప్రైవేట్ రంగ ఉద్యోగుల కోసం జారీ చేసే ఆర్టికల్-18 పర్మిట్లు అత్యధికంగా 1.66 మిలియన్లు ఉండగా, ఇవి మొత్తం పర్మిట్లలో 52.6 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఇక ఆర్టికల్-20 కింద గృహ కార్మికుల పర్మిట్లు 7.73 లక్షలు, ఆర్టికల్-22 కింద ఫ్యామిలీ రీయూనిఫికేషన్ పర్మిట్లు 5.66 లక్షలు నమోదయ్యాయి.
2025లో నమోదైన కొత్త రెసిడెన్సీ ఉల్లంఘనల్లో అరబ్ యేతర ఆసియా దేశాల పౌరులే 61.6 శాతం వాటా కలిగి ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. కొత్త ఉల్లంఘనల్లో ఆర్టికల్-18 (ప్రైవేట్ రంగ ఉద్యోగులు) కింద 4,300 కేసులు నమోదవగా, తాత్కాలిక రెసిడెన్సీకి సంబంధించిన ఆర్టికల్-14 కింద 4,100 కేసులు నమోదయ్యాయి. గృహ కార్మికులు, కుటుంబ కలయిక వీసాలకు సంబంధించిన ఉల్లంఘనలు వీటితో పోలిస్తే తక్కువగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







