ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- July 10, 2026
దోహా: ట్రాఫిక్ జరిమానాలను సకాలంలో చెల్లించాలని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) వాహనదారులకు సూచించింది. గడువులోగా జరిమానాలు చెల్లించడం ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను పొందే అవకాశం ఉంటుందని పేర్కొంది. అలాగే, జరిమానాలు చెల్లించని కారణంగా ఎదురయ్యే చట్టపరమైన చర్యలను నివారించవచ్చని తెలిపింది. ఈమేరకు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
12 నెలలకు పైగా బకాయిగా ఉన్న ట్రాఫిక్ జరిమానాల కేసులను సంబంధిత ప్రాసిక్యూషన్ అధికారులకు బదిలీ చేస్తామని హెచ్చరించింది. అలాంటి కేసుల్లో రాజీ (Reconciliation) ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉండదని స్పష్టం చేసింది. అదే విధంగా, ట్రాఫిక్ ఉల్లంఘన నమోదు అయిన తేదీ నుంచి ఒక నెలలోపు జరిమానా చెల్లిస్తే ఎంపిక చేసిన ట్రాఫిక్ ఉల్లంఘనలపై 50 శాతం రాయితీ వర్తిస్తుందని గుర్తు చేసింది.
జరిమానాలను ఆలస్యం చేయకుండా చెల్లించడం ద్వారా అదనపు శిక్షలు, చట్టపరమైన ఇబ్బందులను నివారించవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వాహనదారులు తమ ట్రాఫిక్ జరిమానాలను తరచూ చేక్ చేసుకొని, నిర్దేశిత గడువులోగా చెల్లించాలని సూచించింది.
తాజా వార్తలు
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!







