ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- July 10, 2026
దోహా: ట్రాఫిక్ జరిమానాలను సకాలంలో చెల్లించాలని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) వాహనదారులకు సూచించింది. గడువులోగా జరిమానాలు చెల్లించడం ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను పొందే అవకాశం ఉంటుందని పేర్కొంది. అలాగే, జరిమానాలు చెల్లించని కారణంగా ఎదురయ్యే చట్టపరమైన చర్యలను నివారించవచ్చని తెలిపింది. ఈమేరకు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
12 నెలలకు పైగా బకాయిగా ఉన్న ట్రాఫిక్ జరిమానాల కేసులను సంబంధిత ప్రాసిక్యూషన్ అధికారులకు బదిలీ చేస్తామని హెచ్చరించింది. అలాంటి కేసుల్లో రాజీ (Reconciliation) ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉండదని స్పష్టం చేసింది. అదే విధంగా, ట్రాఫిక్ ఉల్లంఘన నమోదు అయిన తేదీ నుంచి ఒక నెలలోపు జరిమానా చెల్లిస్తే ఎంపిక చేసిన ట్రాఫిక్ ఉల్లంఘనలపై 50 శాతం రాయితీ వర్తిస్తుందని గుర్తు చేసింది.
జరిమానాలను ఆలస్యం చేయకుండా చెల్లించడం ద్వారా అదనపు శిక్షలు, చట్టపరమైన ఇబ్బందులను నివారించవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వాహనదారులు తమ ట్రాఫిక్ జరిమానాలను తరచూ చేక్ చేసుకొని, నిర్దేశిత గడువులోగా చెల్లించాలని సూచించింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







