దేశంలో భారీగా బంగారం నిల్వలు బయటపడ్డాయి

- August 04, 2016 , by Maagulf
దేశంలో భారీగా బంగారం నిల్వలు బయటపడ్డాయి

దేశంలో భారీగా బంగారం నిల్వలు బయటపడ్డాయి. జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ) ఆధ్వర్యంలో బంగారు గనుల కోసం అన్వేషణ జరిపారు. ఈ విషయాన్ని నేడు కేంద్రం పార్లమెంట్‌కు తెలియజేసింది. గత మూడేళ్లుగా జీఎస్‌ఐ నిర్వహించిన ఖనిజాన్వేషణలో ఈ విషయం బయటపడినట్లు పేర్కొంది. ముఖ్యంగా బిహార్‌, రాజస్థాన్‌, జార్ఖండ్‌, ఒడిశా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లలో ఈ నిల్వలు ఉన్నట్లు తెలిపింది. వీటిల్లో అత్యధికంగా రాజస్థాన్‌లో 6.78మిలియన్‌ టన్నుల బంగారం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com