యూఎస్‌ టాప్‌ 200 వెల్త్‌ మేనేజర్లలో 4 భారతీయులు

- August 04, 2016 , by Maagulf
యూఎస్‌ టాప్‌ 200 వెల్త్‌ మేనేజర్లలో 4 భారతీయులు

అమెరికాలోని అత్యధిక సంపద నిర్వహించే టాప్‌ 200 వెల్త్‌ మేనేజర్లలో నలుగురు భారత సంతతివారికి స్థానం దక్కింది. ఈ 200 మంది కలిసి సుమారు 675 బిలియన్‌ డాలర్ల సంపదను నిర్వహిస్తున్నారు. మెరిల్‌ లించ్‌ ప్రైవేటు బ్యాంకింగ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రూప్‌లో పనిచేసే రాజ్‌శర్మా, ఆకాశ్‌ చోప్రాలు వరుసగా 17, 129 వ స్థానాలను దక్కించుకున్నారు. మెరిల్‌ లించ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌లో పనిచేసే సన్నీ కొఠారీ 176వ ర్యాంకును పొందారు. మోర్గాన్‌ స్టాన్లీలో పనిచేసే రాజుపాఠక్‌ 184వ స్థానంలో ఉన్నారు. ఈ 200 మంది వెల్త్‌మేనేజర్లు సిలికాన్‌ వ్యాలీ బిలియనీర్లు, వాల్‌స్ట్రీట్‌ టైటాన్స్‌, సంపన్నకుటుంబాల వారి సంపదను నిర్వహిస్తుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com