సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!
- April 07, 2026
కువైట్: కువైట్ కు చెందిన 'అల్ థికా గ్రూప్' సామాజిక మరియు మానవీయ బాధ్యత పట్ల తన నిబద్ధతను చాటుకున్నది. ఇటీవల ఇరాన్ డ్రోన్ దాడిలో మరణించిన ఎలక్ట్రీషియన్ సంతానశెల్వం కృష్ణన్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకొచ్చింది. భారత్ లోని అతడి కుటుంబానికి ఏడాది పాటు వేతనాన్ని చెల్లించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
కువైట్లోని ఒక విద్యుత్ మరియు నీటి శుద్ధి కర్మాగారంలో (desalination plant) పనిచేస్తున్న సమయంలో ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో కృష్ణన్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్లిష్ట సమయంలో మృతుడి కుటుంబానికి అండగా నిలిచే లక్ష్యంతో చేపట్టిన ఈ సహాయ కార్యక్రమాన్ని అమలు చేయడానికి, సంబంధిత అధికారుల నుండి అవసరమైన అనుమతులన్నింటినీ పొందినట్లు కంపెనీ వెల్లడించింది.
తాజా వార్తలు
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!
- పిన్ లేకుండానే UPI పేమెంట్స్..
- రేపే RBI పాలసీ నిర్ణయం..
- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్
- మహిళా సంఘాలకు మరో తీపి కబురు తెలిపిన రేవంత్ ప్రభుత్వం









