సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!
- April 07, 2026
కువైట్: కువైట్ కు చెందిన 'అల్ థికా గ్రూప్' సామాజిక మరియు మానవీయ బాధ్యత పట్ల తన నిబద్ధతను చాటుకున్నది. ఇటీవల ఇరాన్ డ్రోన్ దాడిలో మరణించిన ఎలక్ట్రీషియన్ సంతానశెల్వం కృష్ణన్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకొచ్చింది. భారత్ లోని అతడి కుటుంబానికి ఏడాది పాటు వేతనాన్ని చెల్లించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
కువైట్లోని ఒక విద్యుత్ మరియు నీటి శుద్ధి కర్మాగారంలో (desalination plant) పనిచేస్తున్న సమయంలో ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో కృష్ణన్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్లిష్ట సమయంలో మృతుడి కుటుంబానికి అండగా నిలిచే లక్ష్యంతో చేపట్టిన ఈ సహాయ కార్యక్రమాన్ని అమలు చేయడానికి, సంబంధిత అధికారుల నుండి అవసరమైన అనుమతులన్నింటినీ పొందినట్లు కంపెనీ వెల్లడించింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







