సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!
- April 07, 2026
కువైట్: కువైట్ కు చెందిన 'అల్ థికా గ్రూప్' సామాజిక మరియు మానవీయ బాధ్యత పట్ల తన నిబద్ధతను చాటుకున్నది. ఇటీవల ఇరాన్ డ్రోన్ దాడిలో మరణించిన ఎలక్ట్రీషియన్ సంతానశెల్వం కృష్ణన్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకొచ్చింది. భారత్ లోని అతడి కుటుంబానికి ఏడాది పాటు వేతనాన్ని చెల్లించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
కువైట్లోని ఒక విద్యుత్ మరియు నీటి శుద్ధి కర్మాగారంలో (desalination plant) పనిచేస్తున్న సమయంలో ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో కృష్ణన్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్లిష్ట సమయంలో మృతుడి కుటుంబానికి అండగా నిలిచే లక్ష్యంతో చేపట్టిన ఈ సహాయ కార్యక్రమాన్ని అమలు చేయడానికి, సంబంధిత అధికారుల నుండి అవసరమైన అనుమతులన్నింటినీ పొందినట్లు కంపెనీ వెల్లడించింది.
తాజా వార్తలు
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!









