ఇరాన్ వీడాలని భారతీయులకు కేంద్రం ఆదేశం..
- April 08, 2026
టెహ్రాన్: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం అనూహ్య మలుపు తిరిగింది. ఇరాన్పై విరుచుకుపడతామని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అందరినీ ఆశ్చర్యపరుస్తూ రెండు వారాల పాటు దాడులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్యవర్తిత్వంతో ఈ ‘స్మాల్ బ్రేక్’ సాధ్యమైంది. హర్మూజ్ జలసంధిని తెరవాలన్న ప్రధాన డిమాండ్తో అమెరికా ఈ గడువును పొడిగించింది.
అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ, ఇరాన్లో పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఇరాన్లో ఉన్న భారత పౌరులు తక్షణమే ఆ దేశాన్ని వీడాలని భారత ప్రభుత్వం బుధవారం అత్యవసర సలహా జారీ చేసింది. భారత రాయబార కార్యాలయం సూచించిన సురక్షిత మార్గాల ద్వారానే దేశం దాటాలని కోరింది.
ముఖ్య సూచనలు:
- రాయబార కార్యాలయంతో సంప్రదించకుండా అంతర్జాతీయ సరిహద్దుల వద్దకు వెళ్లకూడదు.
- సైనిక స్థావరాలు, విద్యుత్ కేంద్రాలు, బహుళ అంతస్తుల భవనాలపై అంతస్తులకు దూరంగా ఉండాలి.
- అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన నంబర్లు: +989128109115; +989128109109; +989128109102; +989932179359.
- మెయిల్ ఐడి: [email protected].
చిక్కుకున్న 9 వేల మంది భారతీయులు
అధికారిక గణాంకాల ప్రకారం, యుద్ధం ప్రారంభమైన సమయంలో ఇరాన్లో విద్యార్థులతో కలిపి సుమారు 9,000 మంది భారతీయులు ఉన్నారు. ఇప్పటివరకు దాదాపు 1,800 మంది స్వదేశానికి చేరుకోగా, మిగిలిన వారిని సురక్షితంగా తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తాత్కాలికంగా యుద్ధం ఆగిన ఈ రెండు వారాల సమయాన్ని భారతీయులను తరలించేందుకు అనుకూలంగా మార్చుకోవాలని కేంద్రం భావిస్తోంది.
⚠️ Advisory as on 08 April 2026. pic.twitter.com/pusFQIAKKI
— India in Iran (@India_in_Iran) April 8, 2026
తాజా వార్తలు
- వాహనదారులకు రవాణా శాఖ గుడ్న్యూస్
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్కు కొత్త అద్దె సూచిక.. కొత్త చట్టంతో పారదర్శకతకు ప్రాధాన్యం
- కువైట్లో వారం రోజుల్లో 25 వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- మస్కట్లో అల్ అమెరికాత్ ఓవర్పాస్ తాత్కాలికంగా మూసివేత..!!
- సోషల్ మీడియాలో పిల్లల ఫొటోల షేరింగ్ పై అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్..!!
- అమ్మాన్లో అరబ్ దేశాల కీలక సమావేశం.. ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆందోళన..!!
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే







