తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన

- April 08, 2026 , by Maagulf
తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటుపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. వరంగల్ ప్రజల చిరకాల స్వప్నమైన మామునూరు ఎయిర్‌పోర్టుకు రాబోయే మూడు నెలల్లో శంకుస్థాపన చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఆదిలాబాద్‌లో పౌర మరియు సైనిక అవసరాలకు ఉపయోగపడేలా పెద్ద ఎయిర్‌పోర్టు నిర్మించాలని కేంద్రం యోచిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ రక్షణ శాఖకు చెందిన 360 ఎకరాల భూమి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం మరో 450 ఎకరాలు కేటాయిస్తే పనులు ప్రారంభించేందుకు సిద్ధమని చెప్పారు.

అదేవిధంగా కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లాల్లో కూడా ఎయిర్‌పోర్టుల నిర్మాణ ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం ప్రాంతంలో ఎయిర్‌పోర్టు నిర్మాణంపై వచ్చిన నివేదిక సానుకూలంగా ఉందని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com