కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- April 09, 2026
న్యూ ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఖరీఫ్ సీజన్ కోసం న్యూట్రియెంట్ బేస్డ్ సబ్సిడీగా రూ.41,533.81 కోట్లు కేటాయిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రైతులకు ఎరువులు తక్కువ ధరలకు అందించడమే ఈ నిర్ణయ ప్రధాన ఉద్దేశమని కేంద్రం తెలిపింది.
క్యాబినెట్ సమావేశంలో జైపూర్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు కూడా ఆమోదం లభించింది. రూ.13,038 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ప్రహ్లాద్పుర నుంచి తోడి-మోడ్ వరకు 41 కిలోమీటర్ల పొడవైన కారిడార్గా మెట్రో మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు.
రాజస్థాన్లో హెచ్పీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుకు రూ.79,459 కోట్లు కేటాయించారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్లోని పలు జిల్లాల్లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. వీటిలో 1720 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు, 1200 మెగావాట్ల కళాయి-2 హైడ్రో ప్రాజెక్టు ఉన్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...
- భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు
- యూఏఈలో కాలర్ ఐడి స్పూఫింగ్ స్కామ్ పై నిపుణుల వార్న్..!!
- ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్..!!
- సౌదీలో సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కు కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- రక్తదానం..ప్రాణాలను కాపాడే ఒక మానవతా చర్య..!!









