తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- April 08, 2026
తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టుల ఏర్పాటుపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. వరంగల్ ప్రజల చిరకాల స్వప్నమైన మామునూరు ఎయిర్పోర్టుకు రాబోయే మూడు నెలల్లో శంకుస్థాపన చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఆదిలాబాద్లో పౌర మరియు సైనిక అవసరాలకు ఉపయోగపడేలా పెద్ద ఎయిర్పోర్టు నిర్మించాలని కేంద్రం యోచిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ రక్షణ శాఖకు చెందిన 360 ఎకరాల భూమి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం మరో 450 ఎకరాలు కేటాయిస్తే పనులు ప్రారంభించేందుకు సిద్ధమని చెప్పారు.
అదేవిధంగా కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లాల్లో కూడా ఎయిర్పోర్టుల నిర్మాణ ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం ప్రాంతంలో ఎయిర్పోర్టు నిర్మాణంపై వచ్చిన నివేదిక సానుకూలంగా ఉందని చెప్పారు.
తాజా వార్తలు
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం: ట్రంప్ ప్రకటన
- అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!









