తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- April 08, 2026
తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టుల ఏర్పాటుపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. వరంగల్ ప్రజల చిరకాల స్వప్నమైన మామునూరు ఎయిర్పోర్టుకు రాబోయే మూడు నెలల్లో శంకుస్థాపన చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఆదిలాబాద్లో పౌర మరియు సైనిక అవసరాలకు ఉపయోగపడేలా పెద్ద ఎయిర్పోర్టు నిర్మించాలని కేంద్రం యోచిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ రక్షణ శాఖకు చెందిన 360 ఎకరాల భూమి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం మరో 450 ఎకరాలు కేటాయిస్తే పనులు ప్రారంభించేందుకు సిద్ధమని చెప్పారు.
అదేవిధంగా కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లాల్లో కూడా ఎయిర్పోర్టుల నిర్మాణ ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం ప్రాంతంలో ఎయిర్పోర్టు నిర్మాణంపై వచ్చిన నివేదిక సానుకూలంగా ఉందని చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో కాలర్ ఐడి స్పూఫింగ్ స్కామ్ పై నిపుణుల వార్న్..!!
- ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్..!!
- సౌదీలో సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కు కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- రక్తదానం..ప్రాణాలను కాపాడే ఒక మానవతా చర్య..!!
- ఖతార్లోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక ఆరోగ్యంపై ప్రచారం..!!
- నాటోతో బహ్రెయిన్ చర్చలు..కీలక అంశాల పై సమీక్ష..!!
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్









