బహ్రెయిన్ లో ఫుడ్ స్కామ్.. నిందితులకు జైలుశిక్ష, ఫైన్, బహిష్కరణ..!!
- April 10, 2026
మనామా: బహ్రెయిన్ లో ఫుడ్ స్కామ్ కు పాల్పడిన కంపెనీపై సెకండ్ లోయర్ క్రిమినల్ కోర్టు సీరియస్ అయింది. సంస్థను ఆరు నెలలపాటు మూసివేయడంతోపాటు BD5,000 జరిమానా చెల్లించాలని తీర్పును వెలువరించింది. అలాగే, సదరు ఫుడ్ కంపెనీ ఓనర్ కు మూడు సంవత్సరాల జైలు శిక్ష, BD 10,000 ఫైన్ వేసింది. శిక్షాకాలం పూర్తయ్యాక అతడిని దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది. ఇదే కేసుకు సంబంధించి మరో ఐదుగురు నిందితులకు మూడు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్షలు విధించగా, వారిలో ఇద్దరిని శిక్షాకాలం పూర్తయ్యాక దేశం నుంచి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.
గడువు ముగిసిన ఆహార పదార్థాలపై నకిలీ తేదీలతో కొత్త లేబుళ్లు వేసి, వాటిని తిరిగి అమ్మకానికి పెట్టడం ద్వారా ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు కలిగించినందుకు ఆ కంపెనీని కోర్టు దోషిగా నిర్ధారించింది.
స్పెషల్ ఆపరేషన్
అధికారులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టి పాడైపోయిన మరియు నకిలీ సరుకులన్నింటినీ, అలాగే ఉపయోగించిన మెషినరిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, అధికారులు స్వాధీనం చేసుకున్న ఫుడ్ ప్రొడక్టులను నిపుణుల సమక్షంలో ధ్వంసం చేయాలని కోర్టు తన తీర్పులో పేర్కొన్నది. అదేవిధంగా నిందితులు తమ సొంత ఖర్చుతో వాటిగురించి మీడియాలో ప్రచురించాలని కోర్టు ఆదేశించింది.
అంతకుముందు, పోలీసులు పక్కా సమాచాం మేరకు ఒక నివాసం మరియు వాణిజ్య సముదాయంపై దాడి చేశారు. అక్కడ గడువు ముగిసిన మరియు నకిలీ లేబుళ్లతో రీ ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి ఉల్లంఘనలు వినియోగదారుల భద్రతకు ప్రమాదకరమని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది.
తాజా వార్తలు
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !









