సముద్రయానంలో ఖతార్ పురోగతి..Q1లో రికార్డు..!!
- April 10, 2026
దోహా: సముద్రయానంలో ఖతార్ గణనీయమైన పురోగతి సాధించింది. ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో (Q1) సముద్ర రవాణా లావాదేవీలలో ఖతార్ వృద్ధిని నమోదు చేసిందని, రవాణా మంత్రిత్వ శాఖ (MoT) తన 'X' ప్లాట్ఫారమ్ లో వెల్లడించింది. ఈ త్రైమాసికంలో సముద్ర రవాణా వ్యవహారాల విభాగం ద్వారా మంత్రిత్వ శాఖ మొత్తం 3,074 లావాదేవీలను పూర్తి చేసిందని తెలిపింది.
ప్రధానంగా సురక్షిత సిబ్బంది నియామకం (safe manning), నౌకా నిర్మాణ నిపుణులు (naval architect) మరియు మెరైన్ అధికారులకు సంబంధించిన సామర్థ్య ధృవీకరణ పత్రాల జారీ మరియు గుర్తింపు వంటి కీలక సేవలకు సంబంధించినవి ఉన్నాయి. రవాణా మంత్రిత్వ శాఖ ఓడరేవుల కార్యాచరణ సంసిద్ధతను పెంచడం ద్వారా దేశ ఆహార మరియు ఆర్థిక భద్రతకు మద్దతు ఇస్తోందని తెలిపింది.
ఈ సంవత్సరం ఫిబ్రవరి 28 నుండి మార్చి 28 వరకు సముద్ర రవాణా వ్యవహారాల శాఖ ద్వారా 430 లావాదేవీలు పూర్తి కావడంతో ఖతార్ సముద్ర రవాణా రంగం సానుకూల పురోగతిని సాధించింది.
ప్రాంతీయ వాణిజ్య మార్గాలు అనిశ్చితిని ఎదుర్కొంటున్నందున, అంతర్జాతీయ రోడ్డు రవాణా యూనియన్ (IRU) యొక్క TIR వ్యవస్థలో తమ నమోదును వేగవంతం చేయాలని షిప్పింగ్, లాజిస్టిక్స్ కంపెనీలకు ఇటీవల జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ పిలుపునిచ్చింది. ముఖ్యంగా TIR వ్యవస్థ సరిహద్దుల గుండా వస్తువులు రవాణా కావడానికి అనుమతిస్తుందని మంత్రిత్వశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- షార్జాలో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..నవజాత శిశువుతోపాటు ఫ్యామిలీ సేఫ్..!!
- మే నెలలో 4వెలకు పైగా తనిఖీ పర్యటనలు నిర్వహించిన LMRA..!!
- మిడ్ డే ఔట్ డోర్ వర్క్ వయలేషన్స్..జరిమానాల పై PAM హెచ్చరిక..!!
- భారతీయ సిబ్బందిని రక్షించిన ఒమన్..కృతజ్ఞతలు తెలిపిన భారత్..!!
- నిబంధనలు ఉల్లంఘించిన 1,753 ఆహార సంస్థలకు ఎస్ఎఫ్డీఏ జరిమానా..!!
- జూన్లో సౌక్ వాకిఫ్లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్..!!
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!









