ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- April 11, 2026
మస్కట్: ధోఫర్ మున్సిపాలిటీ సంస్కరణలకు శ్రీకారం చుట్టుంది. సేవల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, ప్రక్రియలను వేగవంతానికి ప్రకటనల అనుమతుల జారీ, పునరుద్ధరణ ప్రక్రియలను తన ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్కు మార్చనుంది. డిజిటల్ ప్రక్రియలను బలోపేతం చేయడానికి, సేవల పంపిణీని ఆధునీకరించడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్లు మున్సిపాలిటీ తెలిపింది. ప్రకటనల అనుమతులకు సంబంధించిన అన్ని దరఖాస్తులు మున్సిపాలిటీ ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ ద్వారా ఆన్లైన్లోనే ప్రాసెస్ చేయబడతాయని తెలిపింది. వాణిజ్య వాహనాలు, దుకాణాల ముందు ఉండే డిస్ప్లే యూనిట్ల వంటి వాహనాలపై ఉంచిన ప్రకటనలు, అలాగే వాణిజ్య ప్రాంగణాల వెలుపల పైకప్పులు, గోడలు మరియు పందిళ్లతో సహా భవనాలపై ఏర్పాటు చేసిన ప్రకటనలు ఉంటాయి.
ఈ ఆన్లైన్ సేవ, డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లు, ప్రచురణలు మరియు ముద్రిత సామగ్రికి సంబంధించిన ప్రచార ప్రకటనలతో పాటు ఫుడ్ మెనూలు, సైన్ బోర్డులు మరియు పోస్టర్ల వంటి సేవా సంబంధిత ప్రకటనలను కూడా కవర్ చేస్తుందన్నారు. వ్యాపారాలు మరియు ప్రకటనదారులకు సేవలను సులభంగా అందుబాటులోకి తీసుకురావడం ఈ డిజిటల్ సంస్కరణల ఉద్దేశ్యమని ధోఫర్ మునిసిపాలిటీ తెలిపింది.
తాజా వార్తలు
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..









