పిల్లి నేపథ్యంలో సినిమా...
- August 04, 2016
కోలీవుడ్లో శునకాలకు సంబంధించి చాలా సినిమాలు వచ్చాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఏనుగు, పాముల నేపథ్యంలోనూ తీశారు. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఈగ' చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఈ వరుసలో పిల్లి కూడా ఉన్నప్పటికీ... ఒకట్రెండు సన్నివేశాలకు మాత్రమే పరిమితం చేశారు మన దర్శకులు. ఇప్పుడు పిల్లి ప్రధాన పాత్రలో తమిళంలో పూర్తిస్థాయి చిత్రం తెరకెక్కుతోంది. చిన్నాస్ పళనిస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి 'మియావ్' అని పేరు పెట్టారు. గ్లోబల్ ఉడ్స్ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. దర్శకుడు మాట్లాడుతూ.. '' ఇప్పటివరకు వందకుపైగా ప్రకటనలను రూపొందించా. చాలా కాలంగా పిల్లి నేపథ్యంలో సినిమాను తెరకెక్కించాలని అనుకున్నా. ఇప్పటికి ఆ కోరిక నెరవేరింది. మా కథ కోసం నాగపూర్ నుంచి ఓ పిల్లిని తీసుకొచ్చి నటింపజేశాం. సాధారణంగా దాన్ని అందరూ అపశకునంగా భావిస్తారు. ఈ సినిమాతో పిల్లి అంటే ఇష్టం పెరుగుతుంది. ఇందులో దానికి రెండు పాటలు కూడా ఉన్నాయి. చిత్రీకరణ 34 రోజుల్లో పూర్తి చేశాం. గ్రాఫిక్ పనులకు దాదాపు ఆరు నెలలు పట్టింది. ఇందులో పిల్లికి సెల్ఫీ అని పేరు పెట్టాం. కామెడీ అద్భుతంగా పండింది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు కూడా పూర్తయ్యాయి. సెప్టెంబరులో సినిమాను తెరపైకి తీసుకొస్తామ''ని పేర్కొన్నారు. ఇటీవలే ట్రైలర్, ఫస్ట్లుక్ను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ విడుదల చేశారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!







