పిల్లి నేపథ్యంలో సినిమా...

- August 04, 2016 , by Maagulf
పిల్లి నేపథ్యంలో సినిమా...

 కోలీవుడ్‌లో శునకాలకు సంబంధించి చాలా సినిమాలు వచ్చాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఏనుగు, పాముల నేపథ్యంలోనూ తీశారు. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఈగ' చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఈ వరుసలో పిల్లి కూడా ఉన్నప్పటికీ... ఒకట్రెండు సన్నివేశాలకు మాత్రమే పరిమితం చేశారు మన దర్శకులు. ఇప్పుడు పిల్లి ప్రధాన పాత్రలో తమిళంలో పూర్తిస్థాయి చిత్రం తెరకెక్కుతోంది. చిన్నాస్‌ పళనిస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి 'మియావ్‌' అని పేరు పెట్టారు. గ్లోబల్‌ ఉడ్స్‌ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. దర్శకుడు మాట్లాడుతూ.. '' ఇప్పటివరకు వందకుపైగా ప్రకటనలను రూపొందించా. చాలా కాలంగా పిల్లి నేపథ్యంలో సినిమాను తెరకెక్కించాలని అనుకున్నా. ఇప్పటికి ఆ కోరిక నెరవేరింది. మా కథ కోసం నాగపూర్‌ నుంచి ఓ పిల్లిని తీసుకొచ్చి నటింపజేశాం. సాధారణంగా దాన్ని అందరూ అపశకునంగా భావిస్తారు. ఈ సినిమాతో పిల్లి అంటే ఇష్టం పెరుగుతుంది. ఇందులో దానికి రెండు పాటలు కూడా ఉన్నాయి. చిత్రీకరణ 34 రోజుల్లో పూర్తి చేశాం. గ్రాఫిక్‌ పనులకు దాదాపు ఆరు నెలలు పట్టింది. ఇందులో పిల్లికి సెల్ఫీ అని పేరు పెట్టాం. కామెడీ అద్భుతంగా పండింది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు కూడా పూర్తయ్యాయి. సెప్టెంబరులో సినిమాను తెరపైకి తీసుకొస్తామ''ని పేర్కొన్నారు. ఇటీవలే ట్రైలర్‌, ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ పీసీ శ్రీరామ్‌ విడుదల చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com